Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సువెందు అధికారి ర్యాలీపై తృణమూల్ కాంగ్రెస్ గూండాల దాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ,

నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ర్యాలీపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు...

సువెందు అధికారి ర్యాలీపై తృణమూల్ కాంగ్రెస్ గూండాల దాడి,  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ,
Suvendu Adhikari
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 18, 2021 | 3:34 PM

నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ర్యాలీపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. నందిగ్రామ్ లోని సోనా చుర ప్రాంతంలో ఈ ఎటాక్ జరిగిందన్నారు.  పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగినా ఖాకీలు ప్రేక్షకపాత్ర వహించారని., ఓ బీజేపీ సభ్యుడు తీవ్రంగా గాయపడ్డాడని ఆయన అన్నారు.  ఈ కార్యకర్తను తోటివారు ఆసుపత్రికి తరలించగా టీఎంసీ గూండాలు అక్కడ కూడా గుమికూడి  నానా యాగీ చేశారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ఫైట్ చేయాలనీ, సువెందు అధికారి  పాదయాత్ర ఈ రోజు ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఈ యాత్రను అడ్డుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. తన కళ్ళ ముందే తమ యువమోర్చా నాయకుడొకరిపై ఎటాక్ జరిగిందని, ఇక్కడ వెంటనే పారా మిలిటరీ బలగాలను మోహరించాలని తాను ఎలెక్షన్ కమిషన్ ని కోరుతున్నానని ఆయన అన్నారు.

అటు-తన ఇంటివద్ద,  డజనుకు  పైగా బాంబు దాడులు జరిగాయని, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి అర్జున్ సింగ్ తెలిపారు.మొత్తం 15 చోట్ల టీఎంసీ గూండాలు ఈ ఎటాక్ లు చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు.   అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఎన్నికల తరుణంలో ఈ విధమైన ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాలకేనన్నారు. ఈ బాంబు దాడులకు ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. ఇలా ఉండగా పురూలియాలో ప్రధాని మోదీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు  హాజరయ్యారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ అపసవ్య పాలనపై మోదీ మండిపడ్డారు. కేంద్రం ఈ రాష్ట్రానికి ఇచ్చిన గ్రాంట్లను ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి: Jagapathi Babu and Aamani : ‘ఆహా’కోసం జగపతి బాబు వెబ్ సిరీస్.. జగ్గూభాయ్ కు జోడీగా అలనాటి అందాల నటి ఆమని

Indian Woman Saree Style : సనాతన ధర్మంలో భారతీయ మహిళ చీర ధరించడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందని తెలుసా..!