ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి

బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్‌ అర్జన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన బయటకు వస్తోన్న సమయంలో.

ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:45 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్‌ అర్జన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన బయటకు వస్తోన్న సమయంలో.. కొంతమంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకొచ్చారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరిన అరవింద్ కారును అడ్డుకోవడానికి వారు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు వారిని అడ్డుకోగా.. అరవింద్ కాన్వాయ్‌పై దాడి చేశారు. ఆ తరువాత బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కి తరలించడంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది.