AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: వైసీపీలో చేరిన జనసేన, టీడీపీ నేతలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మరో షాక్‌ తగిలింది. జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో.. వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల నుంచి టీడీపీకి గట్టి దెబ్బలే తగులుతోన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నేతలు వలసలు వెళ్తున్నారు. కాగా.. గతంలో.. వైసీపీలో ఉన్న జూపూడి ప్రభాకర్ రావు.. టీడీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఇక […]

బ్రేకింగ్: వైసీపీలో చేరిన జనసేన, టీడీపీ నేతలు..!!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 08, 2019 | 12:25 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మరో షాక్‌ తగిలింది. జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో.. వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల నుంచి టీడీపీకి గట్టి దెబ్బలే తగులుతోన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నేతలు వలసలు వెళ్తున్నారు. కాగా.. గతంలో.. వైసీపీలో ఉన్న జూపూడి ప్రభాకర్ రావు.. టీడీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఇక ఆకుల సత్యనారాయణ కూడా.. జనసేన పార్టీకి రాజీనామా చేసి.. తాజాగా వైసీపీలో చేరారు.

పార్టీ కండువా కప్పి.. ఇరు నేతలను పార్టీలోకి.. ఆహ్వానించిన సీఎం జగన్. కాగా.. జగన్ పాలనను వీరిద్దరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇచ్చిన హామీలన్నీ జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు.. జగన్ పాలన అద్భుతంగా ఉందని అంటున్నారని ఆకుల సత్యనారాయణ అన్నారు. అలాగే.. రాజశేఖర్ రెడ్డిని.. జగన్ మళ్లీ గుర్తు చేస్తున్నారని ఆకుల పేర్కొన్నారు.