AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు

దేశంలో కొత్తగా 5 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఒకప్పుడు పాతనగరానికే పరిమితమైన..

మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు
K Sammaiah
|

Updated on: Mar 02, 2021 | 6:01 PM

Share

ఒకప్పుడు పాతనగరానికే పరిమితమైన పార్టీ అది.. కంచుకోటను దాటి కదల్లేని స్థితి.. కానీ ఇది ఒకప్పటి మాట.. నేడు పాతబస్తీ దాటడమే కాదు.. పాన్‌ ఇండియా వైపుగా దూసుకెళ్తోంది పతంగి పార్టీ. దేశం నలుమూలలా విస్తరిస్తూ.. ప్రధాన పార్టీలకు సవాల్‌ విసురుతోంది. జాతీయ పార్టీలకే ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశంలో క్రమంంగా విస్తరించేందుకు ఎంఐఎం తన వ్యూహాలకు పదునుపెడుతుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ రాజకీయ చతురత రాటు దేలుతుంది. పాతబస్తీ బయట పాగా కోసం ఎత్తుగడ వేస్తున్నారు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని తేడా లేదు. బలమున్న ప్రతిచోటా పోటీకి దిగుతోంది ఎంఐఎం. మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌లో పోటీకి దిగిన పార్టీ నేడు తమిళనాడు బరిలో దిగుతోంది..

పాతబస్తీ దాటడం ఎలా? పక్క రాష్ట్రంలో పోటీ చేయడం ఎలా..? దీనిపైనే ఫోకస్ పెట్టారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసింది. పార్టీ 63వ దినోత్సవం సందర్భంగా దారుసలాంలో నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కార్పొరేటర్లు.. పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాషాయం వ్యూహాలకు ఎదురొడ్డి నిలిచింది ఎంఐఎం. బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది పతంగి పార్టీ. తాజాగా.. తమిళనాడులో 22 స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది ఎంఐఎం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. 7, 8 తేదీల్లో ఉమ్మడి వేలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు అసదుద్దీన్‌.

ఎంఐఎం వ్యూహాలు రాటుదేలుతున్నాయి. అసదుద్దీన్‌ రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు. పాతబస్తీ బయట పాగా కోసం ఎత్తుగడ వేస్తున్నారు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని తేడా లేదు. బలమున్న ప్రతిచోటా పోటీకి దిగుతోంది ఎంఐఎం. మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌లో పోటీకి దిగిన పార్టీ నేడు తమిళనాడు బరిలో దిగుతోంది..

పాతబస్తీ దాటడం ఎలా? పక్క రాష్ట్రంలో పోటీ చేయడం ఎలా..? దీనిపైనే ఫోకస్ పెట్టారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసింది. పార్టీ 63వ దినోత్సవం సందర్భంగా దారుసలాంలో నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కార్పొరేటర్లు.. పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాషాయం వ్యూహాలకు ఎదురొడ్డి నిలిచింది ఎంఐఎం. బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది పతంగి పార్టీ. తాజాగా.. తమిళనాడులో 22 స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది ఎంఐఎం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. 7, 8 తేదీల్లో ఉమ్మడి వేలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు అసదుద్దీన్‌.

Read more:

సాగునీటి ప్రాజెక్టులపై లోటస్‌పాండ్‌లో విమర్శలు.. షర్మిలది అమాయకత్వమా?.. అజ్ఞానమా? అంటున్న పాలమూరు శ్రేణులు

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..