మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు

దేశంలో కొత్తగా 5 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఒకప్పుడు పాతనగరానికే పరిమితమైన..

మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు
Follow us

|

Updated on: Mar 02, 2021 | 6:01 PM

ఒకప్పుడు పాతనగరానికే పరిమితమైన పార్టీ అది.. కంచుకోటను దాటి కదల్లేని స్థితి.. కానీ ఇది ఒకప్పటి మాట.. నేడు పాతబస్తీ దాటడమే కాదు.. పాన్‌ ఇండియా వైపుగా దూసుకెళ్తోంది పతంగి పార్టీ. దేశం నలుమూలలా విస్తరిస్తూ.. ప్రధాన పార్టీలకు సవాల్‌ విసురుతోంది. జాతీయ పార్టీలకే ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశంలో క్రమంంగా విస్తరించేందుకు ఎంఐఎం తన వ్యూహాలకు పదునుపెడుతుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ రాజకీయ చతురత రాటు దేలుతుంది. పాతబస్తీ బయట పాగా కోసం ఎత్తుగడ వేస్తున్నారు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని తేడా లేదు. బలమున్న ప్రతిచోటా పోటీకి దిగుతోంది ఎంఐఎం. మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌లో పోటీకి దిగిన పార్టీ నేడు తమిళనాడు బరిలో దిగుతోంది..

పాతబస్తీ దాటడం ఎలా? పక్క రాష్ట్రంలో పోటీ చేయడం ఎలా..? దీనిపైనే ఫోకస్ పెట్టారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసింది. పార్టీ 63వ దినోత్సవం సందర్భంగా దారుసలాంలో నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కార్పొరేటర్లు.. పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాషాయం వ్యూహాలకు ఎదురొడ్డి నిలిచింది ఎంఐఎం. బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది పతంగి పార్టీ. తాజాగా.. తమిళనాడులో 22 స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది ఎంఐఎం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. 7, 8 తేదీల్లో ఉమ్మడి వేలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు అసదుద్దీన్‌.

ఎంఐఎం వ్యూహాలు రాటుదేలుతున్నాయి. అసదుద్దీన్‌ రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు. పాతబస్తీ బయట పాగా కోసం ఎత్తుగడ వేస్తున్నారు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని తేడా లేదు. బలమున్న ప్రతిచోటా పోటీకి దిగుతోంది ఎంఐఎం. మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌లో పోటీకి దిగిన పార్టీ నేడు తమిళనాడు బరిలో దిగుతోంది..

పాతబస్తీ దాటడం ఎలా? పక్క రాష్ట్రంలో పోటీ చేయడం ఎలా..? దీనిపైనే ఫోకస్ పెట్టారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసింది. పార్టీ 63వ దినోత్సవం సందర్భంగా దారుసలాంలో నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కార్పొరేటర్లు.. పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాషాయం వ్యూహాలకు ఎదురొడ్డి నిలిచింది ఎంఐఎం. బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది పతంగి పార్టీ. తాజాగా.. తమిళనాడులో 22 స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది ఎంఐఎం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. 7, 8 తేదీల్లో ఉమ్మడి వేలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు అసదుద్దీన్‌.

Read more:

సాగునీటి ప్రాజెక్టులపై లోటస్‌పాండ్‌లో విమర్శలు.. షర్మిలది అమాయకత్వమా?.. అజ్ఞానమా? అంటున్న పాలమూరు శ్రేణులు

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం