చిరు వ్యాపారులకు పెద్దపీట వేస్తా- జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జగన్ చిరు వ్యాపారులకు హామీల వరాలు కురిపించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. పాదయాత్రలో వారి కష్టాలు చూశానని.. వారందరికీ […]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జగన్ చిరు వ్యాపారులకు హామీల వరాలు కురిపించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. పాదయాత్రలో వారి కష్టాలు చూశానని.. వారందరికీ తానున్నానని భరోసా ఇస్తున్నానని చెప్పారు.
అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేస్తామని..ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటిస్తామని.. సకాలంలో పీఆర్సీ అందిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదన్న జగన్..ఈ ఎన్నికలను ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా అభివర్ణించారు.