పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..
వేసవి పండు పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ను నివారిస్తుంది. ఇందులో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీంతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గంగా పని చేస్తుంది. అందుకే వేసవి కాలంలో ప్రజలు పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో మీకు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Updated on: May 05, 2025 | 1:14 PM

పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మంట, తాపాలను తగ్గిస్తుంది. కానీ, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగటం మాత్రం అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఉన్న ఎ-విటమిన్ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుందవి. కానీ, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

కానీ పుచ్చకాయ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. అవును.. కొంతమంది ఎక్కువగా పుచ్చకాయ తింటే అది వారికి మేలుకు బదులు హానికరంగా మారుతుంది. అలాగే, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల పేగులలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలరా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగ, ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయను మితంగా తినాలి. అలాగే కడుపులో నీరు నిలుపుకునే సమస్య ఉన్నవారు కూడా పుచ్చకాయను తక్కువ పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు.

ఆయుర్వేదం ప్రకారం పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని అంటున్నారు. పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం సమతుల్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి




