BCCI Central Contracts 2025: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో కీలక మార్పులు.. ఏ ప్లేయర్కి ఎంత జీతం వస్తుందంటే?
2024లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 2025 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో మార్పులు జరగవచ్చని తెలుస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు పదోన్నతి లభించే అవకాశం ఉండగా, జైస్వాల్, నితీష్ రెడ్డిలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పంత్, జడేజా గ్రేడ్ కూడా మారవచ్చు. కేఎల్ రాహుల్, గిల్ ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
Updated on: Jan 01, 2025 | 10:01 PM

2024లో టీమిండియా ప్రదర్శన ఆశాజనకంగా ఏమి లేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ను గెలవడమే కాకుండా టీమిండియా రాణించలేకపోయింది. ఓ వైపు జట్టులోని స్టార్ ప్లేయర్లు చేతులు ఎత్తివేయగా, మరోవైపు యువ ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు.

అందువల్ల 2025లో టీమిండియా వెటరన్లకు బీసీసీఐ పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని, సెంట్రల్ కాంట్రాక్ట్లో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు క్రికెట్ నిపుణలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లను డిమోట్ చేసే అవకాశం ఉంది. అలాగే జైస్వాల్, నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్లో ఎవరికి డిమోషన్ మరియు ప్రమోషన్ లభిస్తుందో తెలుసా?

2024లో టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లో లేడు. అందువల్ల రోహిత్ పేలవమైన ప్రదర్శన కారణంగా BCCI A+ గ్రేడ్ నుండి A గ్రేడ్కి తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏ+ గ్రేడ్లో ఉన్న రోహిత్ ఏటా రూ.7 కోట్లు జీతం పొందుతున్నాడు. కానీ ఏ గ్రేడ్ కు దిగజారితే ఏడాదికి రూ.5 కోట్లే వస్తాయి

విరాట్ కోహ్లి రోహిత్ లాగే అంతగా పదర్శన ఏమి చేయడం లేదు. దీంతో విరాట్ను కూడా A గ్రేడ్కి తగ్గించే అవకాశం ఉంది.

ఈ ఏడాది టెస్టుల్లో 1478 పరుగులతో యశస్వి జైస్వాల్ సత్తాచాటాడు. అందువల్ల బీసీసీఐ కాంట్రాక్ట్లో జైస్వాల్కు పదోన్నతి లభించే అవకాశం ఉంది. జైస్వాల్ ప్రస్తుతం రూ.3 కోట్ల వార్షిక వేతనంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో బి గ్రేడ్లో ఉన్నాడు.

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో సి-గ్రేడ్లో ఉన్నాడు. ఏటా రూ.1 కోటి జీతం వస్తుంది.




