Andhra News: ఆ పెన్నులతో పరీక్ష రాస్తే పాస్ గ్యారంటీ… ! ఉచితంగానే పంపిణీ
పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతారు. కొద్ది రోజుల ముందు నుండి పరీక్షలు కోసం పుస్తకాలతో కుస్తీ పడతారు. ఓ వైపు చదవడంతో పాటు రకరకాల ట్రిక్స్ ను, సెంటిమెంట్ లను ఫాలో అవుతూ ఉంటారు.పిల్లల చదువుల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం తెగ హైరానా పడతారు. తమ పిల్లలు పరీక్షలలో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తె దర్శనం చేసుకుంటామని , ముడుపులు చెల్లించుకు కుంటామని తమ ఇష్ట దైవాలకు కొందరు తల్లిదండ్రులు మొక్కులు మొక్కుకుంటారు. ఇక పరీక్షల ప్రారంభం రోజైతే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను దగ్గరుండి ఉదయాన్నే ఆలయానికి తీసుకువెళ్ళి పెన్ను, హాల్ టికెట్ను దేవుడు వద్ద ఉంచి పూజలు చేశాకే పరీక్ష కేంద్రంకి తీసుకువెళతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
