రాహు సంచారం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యతే వేరు. రాహు గ్రహం రాశులపై ప్రత్యేకంగా, పరోక్షంగా చాలా ప్రభావం చూపుతుంది. ఇది మంచి స్థానంలో ఉంటే అన్నీ శుభలే జరుగుతాయి, అలాగే రాహు గ్రహం నీచ స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి సమస్యలు, కష్టాలు , ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉంటాయి.
Updated on: Nov 07, 2025 | 12:03 PM

జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యతే వేరు. రాహు గ్రహం రాశులపై ప్రత్యేకంగా, పరోక్షంగా చాలా ప్రభావం చూపుతుంది. ఇది మంచి స్థానంలో ఉంటే అన్నీ శుభలే జరుగుతాయి, అలాగే రాహు గ్రహం నీచ స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి సమస్యలు, కష్టాలు , ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉంటాయి.

ఇక గ్రహాల సంచారం లేదా కలయిక అనేది కామన్, అయితే అతి త్వరలో రాహు గ్రహం సచారం చేయనున్నది. చాలా నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహు గ్రహం ఒకటి. ఇది నవంబర్ 23వ తేదీన నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన మూడు రాశుల వారికి ఆదాయం పెరగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారికి రాహు గ్రహ సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యగంలో చేరి చాలా ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి రాహు గ్రహం నక్షత్ర సంచారం వలన ధనం పెరుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికి అందుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.

మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. రాహువు నవంబర్ 23వ తేదీన శతభిషా నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గతంలో పడ్డ కష్టానికి ఇప్పుడు తప్పకుండా గుర్తింపు లభించబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రానుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.



