Nidhivan Mystery : ఆ పుణ్యక్షేత్రంలో నేటికీ రాధాకృష్ణుల రాసలీలలు.. మర్మం కనిపెట్టడానికి వెళ్లినవారికి కళ్ళు పోయిన వైనం
దేవుడు ఉన్నాడు లేడు ఇది ఎప్పుడు ఆస్తికులు, నాస్తికుల మధ్య జరిగే చర్చ... అయితే దేవుడు ఉన్నాడు అనడానికి మనదేశంలో అనేక అంతు చిక్కని రహస్యాలను నింపుకున్న దేవాలయాలు, ప్రాంతాలు ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని వెళ్లి చాలా మంది తమ జీవితాలను కోల్పోయారు. ఇటువంటి కోవలోకి చెందుతుంది.. మధురలో నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి.
Updated on: Mar 25, 2021 | 12:28 PM

ఉత్తర్ ప్రదేశ్ లోని బృందావనంలో ఉన్న నిధివన్ ఒక రహస్య ప్రాంతం. ఈ ప్లేస్ ద్వాపర యుగంలో కృష్ణుడు, రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధకృష్ణలు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపాలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం.

సూర్యాస్తమయం అయితే చాలు నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను మూసివేస్తారు. ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు. ఒకవేళ ఎవరైనా నిధి వన్ లో రాత్రి పూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికీ పిచ్చిపట్టడం.. లేదా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయట. అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జయపూర్ కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివన్ లో ఏమి జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట. రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశద్వారంలో అతను అచేతనంగా పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలోనూ ఓ భక్తునికి ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడి రాసలీలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట

అయితే ఈ నిధివన్ దగ్గరగా స్థానికుల ఇళ్లు ఉన్నాయి. అయితే వాటికీ కిటికీలు ఉండవు. ఎందుకంటే నిధి వన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు. నిధి వన్ లో రాత్రిపూట జరిగే రాసలీలలను చూడాలనుకోవడం పాపంగా బావిస్తారు.

నిధివన్ నుంచి రాత్రి సమయంలో పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తాయని చెబుతారు. కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం. నిధివన్ ఆలయం చుట్టు ప్రక్కల ఉండే వన తులసి చెట్టు, చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ప్రతి రెండు చెట్లు ఒకదానిని ఒకటి పెనవేసుకుని ఉంటాయి. రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించే గోపికలు, పగటి సమయంలో ఇలా చెట్ల రూపంలో ఉంటాయని ఈ క్షేత్రంలో చెప్పుకుంటారు.

వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్లు తోముకోవడానికి రెండు వేపపుళ్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూళం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచం పై ఉన్నదుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు.

నిధివన్ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు.

నాస్తికులకు, హేతువాదులకు ఇప్పటి వరకూ నిధివన్ మర్మం అంతుచిక్కలేదు. కొందరు నాస్తికులు “నిధివన్ లో దేవుడు లేడు" అని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఆ ఆలయ ప్రహరీ లోపల సంచరించారు. అలా ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళుపోవటం, మతిచెడిపోవటం లాంటివి జరిగాయి. కొంతమంది ఆధునిక హేతువాదులు, చాలా రహస్యంగా ఆ ఆలయం లోపల నిఘా కెమెరాలు" అమర్చి విఫలమయ్యారు కూడా





























