Divine Mysteries: మనిషి జీవితమే ఈ చిదంబరం ఆలయం .. ఇక్కడ ఎన్నో రహస్యాలు.. అవన్నీ చిదంబర రహస్యమే..!
భారత దేశంలో అనేక హిందూ దేవాలయాలు.. ముఖ్యంగా తమిళనాడులో అనేక దేవాలయాలున్నాయి వాటిల్లో ఒకటి చిదంబరం దేవాలయం. ఈ క్షేత్రంలో పరమశివుడు పూజలందుకుంటాడు. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, పల్లవ , చోళ రాజుల కాలంలో.. ఈ ఆలయంలో పలు నూతన నిర్మాణాలు జరిగాయి.
Updated on: Apr 17, 2021 | 11:39 AM

ఇక్కడ పూజలను అందుకుంటున్న పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. స్వామి తన సతీమణి శక్తితో కలసి ఆద్యాంతరహితమైన చిద్విలాసంతో "ఆనంద తాండవ" నృత్యాన్ని నిరంతరంగా చేస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వ్రేలాడదీసిన బంగారు 'బిల్వ' పత్రాల వరుసలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి. తెరకి బైట వైపు నల్లగా ఉండి అజ్ఞానాన్ని సూచిస్తుంది. లోపలి వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి జ్ఞానాన్ని , ఆనందాన్ని సూచిస్తుంది

హిందూ పురాణాల ప్రకారం చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాల కి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ , కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.

ఈ ఆలయం 40 ఎకరాల విస్తీర్ణంలో 8ఉంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన, చారిత్రాత్మక దేవాలయం చిదంబర ఆలయం.

సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయప్రత్యేకత. భరతనాట్య నృత్యం యొక్క దైవం పరమ శివుడుని విశ్వాసం. ఇక ఇక్కడ శివుడు దర్శనమిచ్చే లింగానికి భిన్నంగా మనుష్య ఉన్న అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.

చిదంబరం లోని శివుని ఆలయాన్ని క్రీ.శ.1213 లో అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ పునర్నిర్మించాడు. ఇక మనం తరచుగా వాడే చిదంబర రహస్యం ఇక్కడ నుంచే వచ్చినట్లు పెద్దల విశ్వాసం. చిదంబర రహస్యం అంటే ఆ సమయంలో భగవంతుడికి పూర్తిగా లొంగి, ఆయనను మనలో లీనం చేసుకొని... అజ్ఞానాన్ని తొలగించుకొని, భగవంతుడి సమక్షాన్ని 'చూసి మరియు అనుభవించి' అందువలన కలిగే బ్రాహ్మానందాన్ని పొందుతారు

చిదంబరుడిని చేరుకోవాలంటే... తమిళనాడు కడలూర్ జిల్లాకి ముందుగా అడుగు పెట్టాలి. అనంతరం అక్కడ నుంచి కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరి కి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఏ క్షేత్రం ఉంది. ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఉన్న ఆలయంలో చిదంబరుడు పూజలను అందుకుంటున్నాడు.




