కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. ఈ జిల్లాలకు.!

భానుడి భగభగలకు సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలో అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడగా.. ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాల పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

|

Updated on: Mar 19, 2024 | 12:31 PM

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలో అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడగా.. ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాల పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. భానుడి భగభగలకు సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలో అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడగా.. ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాల పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. భానుడి భగభగలకు సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

1 / 5
అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. వర్షాల కారణంగా వచ్చిన మార్పులతో ప్రజలు రిలాక్స్ అవుతుంటే.. రైతులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలతో పాటు నష్టాలను తెచ్చిపెట్టాయి. సిరిసిల్ల జిల్లాలో చెట్టుకూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ డివిజన్‌లో కురిసిన భారీ వర్షంతో మామిడి,  బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంటలను కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు.

అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. వర్షాల కారణంగా వచ్చిన మార్పులతో ప్రజలు రిలాక్స్ అవుతుంటే.. రైతులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలతో పాటు నష్టాలను తెచ్చిపెట్టాయి. సిరిసిల్ల జిల్లాలో చెట్టుకూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ డివిజన్‌లో కురిసిన భారీ వర్షంతో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంటలను కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు.

2 / 5
తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అవి కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలు. ఇక రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది..జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో ఉండగా..మిగిలిన జిల్లాలకు గ్రీన్‌ అలర్ట్‌ ఉంది. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే పలుచోట్ల వర్షం పడుతోంది..దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఆకాశం మేఘావృతమైంది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అవి కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలు. ఇక రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది..జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో ఉండగా..మిగిలిన జిల్లాలకు గ్రీన్‌ అలర్ట్‌ ఉంది. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే పలుచోట్ల వర్షం పడుతోంది..దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఆకాశం మేఘావృతమైంది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

3 / 5
 ఏపీ వాతావరణం కూడా కూల్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీ వాతావరణం కూడా కూల్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

4 / 5
అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. మొత్తంగా ఏపీలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఇక తెలంగాణలోని నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ల్లోనూ పలుచోట్ల వడగండ్ల వాన పడింది. రాష్ట్రంలోని 21 జిల్లాలకు అకాల వర్షం ముప్పు పొంచి ఉంది. వడగండ్ల వానతో చాలా ప్రాంతాల్లో వరి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో మామిడి పూత రాలిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. మొత్తంగా ఏపీలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఇక తెలంగాణలోని నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ల్లోనూ పలుచోట్ల వడగండ్ల వాన పడింది. రాష్ట్రంలోని 21 జిల్లాలకు అకాల వర్షం ముప్పు పొంచి ఉంది. వడగండ్ల వానతో చాలా ప్రాంతాల్లో వరి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో మామిడి పూత రాలిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

5 / 5
Follow us
Latest Articles