Narendra Modi: పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ .. ఫోటోలు..
PM Modi Unveiled National Emblem Photos: దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Updated on: Jul 11, 2022 | 3:13 PM

దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

మొత్తం 9500 కిలోల కాంస్యంతో 6.5 మీటర్ల ఎత్తుతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ ఫోయర్ పైభాగంలో ఏర్పాటు చేశారు.

ఈ చిహ్నానికి సపోర్ట్గా 6500 కిలోల ఉక్కుతో సహాయక నిర్మాణం చేపట్టారు.

కొత్త పార్లమెంట్ భవనం పై కప్పుపై జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెట్, కాస్టింగ్ను క్లే మోడలింగ్/కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా చేసారు.

ఎనిమిది దశలలో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

కాగా, జాతీయ చిహ్నం ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ..

కొత్త పార్లమెంట్ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యమైన అధికారులు, కార్మికులతో కాసేపు మాట్లాడారు.

ఫొటోస్ ఇక్కడ చూడగలరు..

పార్లమెంట్ భవనంపై భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఫొటోస్

పార్లమెంట్ భవనంపై భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఫొటోస్




