ఇదో వింత ఆచారం.. ముల్లులతో ఏర్పాటు చేసిన ఊయలలో ఊగితే ఇలా జరుగుతుందట..
అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవెల్లి గ్రామంలో నమ్మకాలు, విశ్వాసాలు ఎక్కువ. భక్తి భావంతో అంతా సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజల సందర్భంగా అందరూ ఒక చోట చేరుతారు. గ్రామంలో ఉన్న శివాలయం వద్ద ముల్లులతో ఊయల ఏర్పాటు చేస్తారు. ఆ ఊయలలో గిరిజనులు ఒక్కొక్కరు ఊగుతూ ఉంటారు. ముల్లు గుచ్చుకొని గాయాలు పాలు కాకుండా తమకు అమ్మవారే రక్షిస్తారని అక్కడ గిరిజనుల నమ్మకం.
Most Read Stories