Masala Vada: యమ క్రిస్పీగా ఉండే మూడు పప్పులతో మసాలా వడ.. చల్లారినా కరకరలాడాల్సిందే
వర్షం పడుతున్నప్పుడో లేక సాయంత్రం నాలుగు గంటల వేళకో కరకరలాడే వేడివేడి మసాలా వడలు, పక్కన ఘుమఘుమలాడే అల్లం టీ ఉంటే ఆ మజానే వేరు. సాధారణంగా మసాలా వడలను కేవలం పచ్చిశనగపప్పుతో మాత్రమే తయారుచేస్తారు. అవి నూనెలో నుంచి తీసినప్పుడు వేడిగా క్రిస్పీగానే ఉంటాయి కానీ కాసేపు చల్లారేసరికి మెత్తబడి సాగుతాయి. అయితే ఒక్కసారి పచ్చిశనగపప్పుతో పాటు కందిపప్పు, మినప్పప్పు సమానంగా కలిపి 'మూడు పప్పుల మసాలా వడ' చేసి చూడండి. నూనెలో నుంచి తీసినప్పుడు యమ క్రిస్పీగా ఉండటమే కాకుండా, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా గంటల తరబడి ఎక్స్ట్రా క్రంచీగా ఉండటం ఈ వడల ప్రత్యేకత. నోరూరించే ఈ స్పెషల్ మసాలా వడ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
