Coronavirus Updates: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. తొలిసారి 7 వేల మార్క్కు..
corona in india: దేశంలో కరోనా ట్రాకింగ్ మళ్లీ భయపెడుతోంది. మహమ్మారి మళ్లీ మేలుకుని.. విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సీజన్లో తొలిసారిగా బుధవారం ఏడువేల మార్క్ దాటింది.
Updated on: Jun 09, 2022 | 11:09 AM

దేశంలో కరోనా ట్రాకింగ్ మళ్లీ భయపెడుతోంది. మహమ్మారి మళ్లీ మేలుకుని.. విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సీజన్లో తొలిసారిగా బుధవారం ఏడువేల మార్క్ దాటింది. మర్చి నెల తరువాత ఒకరోజున నమోదైన అత్యధిక కరోనా కేసుల సంఖ్య ఇదే. మునపటి రోజుతో పోలిస్తే ఏకంగా 40 శాతం కేసులు పెరిగాయి.. గత 24 గంటల్లో ఎనిమిది మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేల 498కి చేరింది.

వీక్లీ పాజిటివిటీ రేట్ 0.91 ఉండగా, ఇప్పుడు డైలీ పాజిటివిటీ రేట్ 1.62కి పెరిగింది. ఏకంగా ఐదు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది కరోనా. ఇది కరోనా ఫోర్త్ వేవ్ దూకుడుకి సంకేతమేనని, ఇప్పుడు మేలుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Corona In India

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్... బీ ఎలర్ట్ అంటూ టీ-సర్కార్కు హెచ్చరించింది హైకోర్టు. కొవిడ్ కేసులపై విచారణ జరిపిన హైకోర్టు, పరీక్షల సంఖ్య పెంచాల్సిందే అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని చెబుతూ, విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది హైకోర్టు.

ఈసారి ముంచుకొస్తున్న కోవిడ్ వేవ్.. చిన్నారుల్నే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత 24 గంటల్లో ముంబైలో నమోదైన కేసుల్లో 9 శాతం... 19 ఏళ్ల లోపు వయసువాళ్లే. స్కూల్ ఏజ్ పిల్లలు కరోనా నుంచి మూడునాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. టీనేజ్ బాధితుల్లో మాత్రం రికవరీ రేట్ తక్కువగా వుంది.

ఏవియేషన్ సెక్టార్లో కరోనా ఫియర్స్ పీక్స్కు చేరుకున్నాయి. విమాన ప్రయాణీకులకు తాజాగా గైడ్లైన్స్ జారీ చేసింది DGCA. ఫేస్ మాస్క్ ధరించని ప్యాసింజర్లను వెంటనే విమానాల్లోంచి దించెయ్యాలని అధికారులను ఆదేశించింది. విమానం దిగేవరకు మాస్క్ తీయకూడదని, అలా తీస్తే... ఉల్లంఘన కింద కేసు రిజిస్టర్ చేసి జరిమానా విధించాలన్నది తాజా షరతు.

కరోనా ఫోర్త్ వేవ్ని అనఫీషియల్గా కన్ఫమ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం... నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఫోకస్ పెట్టింది. తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్ని హాట్స్పాట్స్గా పరిగణిస్తోంది. ఇంటర్-స్టేట్ రవాణాపై ఆంక్షలు విధించే ఆలోచన కూడా జరుగుతోంది. జూన్ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ గైడ్లైన్స్ కఠినంగా అమలయ్యే అవకాశం ఉంది.

అటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ఇంకా శాంతించనే లేదు. కరోనా మృతుల్లో అధికపక్షం తక్కువ ఆదాయమున్న దేశాలకు చెందినవారేనని తేల్చింది WTO. 20 నెలల్లో కోవిడ్ భూతం కోటీ 75 లక్షల మందిని మింగేసిందని, ధనిక దేశాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉందని చెప్పింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.

కరోనాకు పార్లల్గా మంకీపాక్స్ వైరస్ కూడా ప్రపంచాన్ని భయపెడుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన మంకీపాక్స్ ఇప్పటికే 29 దేశాలకు పాకింది. తుంపర్ల ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నా, సరైన కారణం మాత్రం ఇంకా తెలీలేదు. అటు కోవిడ్ ఫోర్త్వేవ్... ఇటు మంకీపాక్స్.. జనజీవితాల్ని రౌండప్ చేసి భయపెడుతున్నాయిప్పుడు.

Corona In India




