వాటర్ బాటిళ్లలో మురికి ఇట్టే మాయం.. ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే.. మిళమిళ మెరవాల్సిందే!
చాలా మంది ఇల్లలో లేదా ఆఫీస్లతో నీళ్లు తాగడానికి బాటిళ్లను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని రోజులు వాడి తర్వాత మీరు తాగే వాటర్ బాటిల్స్ కొంత మురికిగా మారుతాయి. అలాంటి వాటిని క్లీన్ చేయకుండా త్రాగడం వల్ల ఆరోగ్య సమ్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటర్ బాటీల్స్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి బాటిళ్లను శుభ్రం చేయడం చాలా కష్ట పడుతారు. కానీ వాటిలోని మరలను తొలగించలేరు. అయితే, కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో, మీరు మీ నీటి బాటిల్ను కొత్తగా మెరిసేలా చేయవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Nov 11, 2025 | 6:18 PM

బేకింగ్ సోడా, నీరు: మీ వాటర్ బాటిల్ శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడా జోడించండి. దానిని బాటిల్లో పోసి బాగా చేక్ చేయండి. ఆ తర్వాత బాటిల్ను మూసివేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత చిన్న బ్రష్తో శుభ్రం చేసుకోండి. ఈ పద్ధతి బ్యాక్టీరియాతో పాటు మరకలు, దుర్వాసన కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది బాటిల్ను కొత్తదానిలా మెరిసేలా చేస్తుంది.

వెనిగర్: సీసా వాసనలను వెనిగర్ తో సులభంగా తొలగించవచ్చు. దీని కోసం, ఒక కప్పు తెల్ల వెనిగర్ తీసుకొని బాటిల్ లో పోయాలి. అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత బాటిల్ ని బాగా కడగాలి. వెనిగర్ బాటిల్ ని శుభ్రం చేయడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

నిమ్మరసం: దీనికోసం, ఒక నిమ్మకాయ నుండి రసాన్ని పిండుకుని సీసాలో పోయాలి. సీసాలో కొద్దిగా నీరు వేసి బాగా షేక్ చేయాలి. నిమ్మకాయలోని ఆమ్లం బ్యాక్టీరియాను చంపి సీసా తాజాదనాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా, వెనిగర్: దీనికోసం, బాటిల్ కు 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ వెనిగర్ కలపండి. బాటిల్ ను మూసివేసి బాగా కదిలించండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెండు ద్రావణాలు కలిసి మురికి, దుర్వాసనను తొలగిస్తాయి.

బియ్యం, నీరు: నీటి సీసాలను బియ్యం నీటిని ఉపయోగించి కూడా శుభ్రం చేయవచ్చు. కొంచెం ముతక బియ్యాన్ని తీసుకొని బాటిల్లో కలపండి. కొద్దిగా నీరు వేసి బాటిల్ను బాగా కదిలించండి. అప్పుడు బాటిలోని బియ్యం దాని లోపలి గోడలను శుభ్రం చేస్తాయి. మురికిని తొలగిస్తాయి. తరువాత, దానిని బాగా శుభ్రం చేయండి.




