Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో మూడో ధనవంతుడై గౌతమ్ అదానీ గురించి ఈ విషయాలు తెలుసా?
భారత వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ అయిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మన దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో అత్యున్నత కుబేరుడిగా నిలిచినట్లు..
Updated on: Aug 30, 2022 | 5:36 PM

భారత వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ అయిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మన దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో అత్యున్నత కుబేరుడిగా నిలిచినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ రోజు (ఆగస్టు 30) వెల్లడించింది. 60 యేళ్ల వయసున్న అదానీ దాదాపు పది లక్షల కోట్ల (137 బిలియన్ డాలర్లు) ఆస్తికి అధిపతి. ప్రపంచ కుబేరుల్లో మొదటి రెండు స్థానాల్లో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నిలిచారు.

భారత వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ అయిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మన దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో అత్యున్నత కుబేరుడిగా నిలిచినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ రోజు (ఆగస్టు 30) వెల్లడించింది. 60 యేళ్ల వయసున్న అదానీ దాదాపు పది లక్షల కోట్ల (137 బిలియన్ డాలర్లు) ఆస్తికి అధిపతి. ప్రపంచ కుబేరుల్లో మొదటి రెండు స్థానాల్లో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నిలిచారు.

అందరికీ గౌతమ్ అదానీ బడా వ్యాపార వేత్తగానే తెలుసు. నిజానికి అతనొక కాలేజీ డ్రాపౌట్ స్టూడెంట్. అదానీ తండ్రి బట్టల షాప్ ద్వారా తన తొలి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా.. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్పై జరిగిన దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిలో గౌతమ్ అదానీ కూడా ఒకరు.

గౌతమ్ అదానీకి కరణ్, జీత్ అదానీ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో కరణ్ అదానీకి వివాహం జరిగింది. అతని భార్య సిరిల్ ష్రాఫ్ కుమార్తె అయిన పరిధి ష్రాఫ్. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. పేరు అనురాధ కరణ్ అదానీ. పెద్దకొడుకైన కరణ్ అదానీ ప్రస్తుతం అదానీ పోర్ట్స్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

గౌతమ్ అదానీ కుటుంబం




