- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli surpasses Virender Sehwag and becomes India’s 5th highest run getter in Test Format
IND vs WI: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. ఆ మాజీ ఓపెనర్ని అధిగమించి ‘టీమిండియా’ టాప్ 5 లిస్టులోకి..
Virat Kohli: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలోకి చేరడంతో పాటు, మాజీ డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ని అధిగమించాడు.
Updated on: Jul 14, 2023 | 11:05 AM

IND vs WI 1st Test: కరేబియన్ దీవుల్లోని డొమినికా వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్టులో విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ని అధిగమించాడు. టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న సెహ్వాగ్ని వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

మూడో రోజు క్రీజులోకి వచ్చిన కోహ్లీ 24 పరుగుల వద్ద వీరేంద్ర సెహ్వాగ్(8503)ని అధిగమించి ఈ ఘనత సాధించాడు. మొత్తంగా కోహ్లీ ఇప్పటివరకు 8515 పరుగులు చేశాడు. ఇంకా కోహ్లీ కంటే ముందు ఎవరెవరు ఉన్నారంటే..?

సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున 329 టెస్ట్ ఇన్సింగ్స్ ఆడి మొత్తం 15921 పరుగులు చేశాడు.

రాహుల్ ద్రవిడ్ 286 ఇన్సింగ్స్ల్లో 13288 టెస్ట్ పరుగులు నమోదు చేశాడు.

ఈ లిస్ట్లో సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు. భారత్ తరఫున 214 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సన్నీ మొత్తంగా 10122 రన్స్ సాధించాడు.

తెలుగు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ 225 ఇన్నింగ్స్లో 8781 పరుగులు చేశాడు.

వెస్టీండీస్పై తన 186వ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8515 పరుగులు చేశాడు. తద్వారా ఈ లిస్టులో 8503 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్న విరేంద్ర సెహ్వాగ్ని వెనక్కు నెట్టి.. ఆ ప్లేస్ని తన సొంతం చేసుకున్నాడు.

ఫలితంగా 180 ఇన్నింగ్స్ల్లో 8503 రన్స్ చేసిన విరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు.. టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో 6వ స్థానానికి చేరాడు.





























