- Telugu News Photo Gallery Cricket photos Team India Cricketer Siddharth Kaul has announced his retirement
6 మ్యాచులకే టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్.. ఎవరంటే?
Siddharth Kaul: భారత ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే సోషల్మీడియాలో షేర్ చేశాడు. అతను భారతదేశం కోసం వన్డే, T20 క్రికెట్లో ఆడాడు. అయితే గత ఐదేళ్లుగా అతనికి అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు.
Updated on: Nov 28, 2024 | 10:46 PM

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో ఓ భారత ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఆటగాడు మరెవరో కాదు.. ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్..

సిద్ధార్థ్ కౌల్ చివరిసారిగా 2019లో భారత్ తరఫున ఆడాడు. అప్పటి నుంచి సిద్ధార్థ్ కౌల్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. ఆ జట్టులో సిద్ధార్థ్ కౌల్ కూడా ఉన్నాడు.

సిద్ధార్థ్ టీమ్ ఇండియా తరఫున 3 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. ఐపీఎల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సిద్ధార్థ్ 2018లో ఐర్లాండ్తో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది ఇంగ్లండ్పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీ20 క్రికెట్లో 4 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

.సిద్ధార్థ్ కౌల్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఐపీఎల్లో 55 మ్యాచ్లు ఆడి 58 వికెట్లు తీశాడు. చివరి ఐపీఎల్ మ్యాచ్ 2022లో జరిగింది.

సిద్ధార్థ్ కౌల్ సోషల్ మీడియాలో తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించాడు.




