Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. రైనా, సిద్ధూను దాటేసి ప్రథమ స్థానంలో నిలిచిన విరాట్..

IND vs PAK: భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభమాన్ గిల్ 58, విరాట్ కోహ్లీ 122*, కేఎల్ రాహుల్ 111* పరుగులు, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్‌ ప్లేయర్లు మర్చిపోలేనిని విధంగా ప్రత్యర్థి జట్టును ఓడించారు. ఇక ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులతో పాటు అజేయంగా 77వ సెంచరీని పూర్తి చేసుకున్న కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆసియా కప్‌లో భారత్ తరఫున ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. అదేమిటంటే..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 10:04 AM

IND vs PAK: భారత ఓపెనర్లుగా రోహిత్, శుభమాన్ జట్టుకు శుభారంభం అందించారు. అయితే రోహిత్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 94 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేయడంతో పాటు అజేయమైన సెంచరీని నమోదు చేశాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతగా నిలిచాడు.

IND vs PAK: భారత ఓపెనర్లుగా రోహిత్, శుభమాన్ జట్టుకు శుభారంభం అందించారు. అయితే రోహిత్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 94 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేయడంతో పాటు అజేయమైన సెంచరీని నమోదు చేశాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతగా నిలిచాడు.

1 / 5
ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఆసియా కప్ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఆసియా కప్ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

2 / 5
నిజానికి పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, మాజీ కెప్టెన్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ తలో 3 అవార్డులతో అగ్రస్థానంలో ఉండేవారు.

నిజానికి పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, మాజీ కెప్టెన్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ తలో 3 అవార్డులతో అగ్రస్థానంలో ఉండేవారు.

3 / 5
కానీ పాక్‌పై అజేయంగా 122 పరుగులు చేసిన కోహ్లీ నాలుగో అవార్డను గెలుచుకోవడం ద్వారా ప్రధమ స్థానంలోకి ప్రవేశించాడు. దీంతో  రైనా, సిద్ధూను రెండో స్థానంలోకి దిగారు.

కానీ పాక్‌పై అజేయంగా 122 పరుగులు చేసిన కోహ్లీ నాలుగో అవార్డను గెలుచుకోవడం ద్వారా ప్రధమ స్థానంలోకి ప్రవేశించాడు. దీంతో రైనా, సిద్ధూను రెండో స్థానంలోకి దిగారు.

4 / 5
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్‌పై విజయం సాధించింది.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్‌పై విజయం సాధించింది.

5 / 5
Follow us