- Telugu News Photo Gallery Cricket photos India vs england 2nd semifinal t20 world cup 2022 virat kohli become 1st batter to 4000 in t20i
Virat Kohli: టీ20 క్రికెట్లో ‘కోహ్లీ’ తుఫాన్.. తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..
India vs England: ఇంగ్లండ్పై విరాట్ కోహ్లీ 15వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 4 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు.
Updated on: Nov 10, 2022 | 3:28 PM

విరాట్ కోహ్లి టీ20 క్రికెట్లో సంచలనంగా మారాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్లోకి వచ్చిన కోహ్లిని అడ్డుకోవడం ప్రపంచంలోని ఏ బౌలర్ వల్ల కావడం లేదు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఇంగ్లండ్పై 15వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి 43 పరుగులకు చేరుకున్న కోహ్లి.. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 4 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్గా కోహ్లీ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్కు ముందు కోహ్లీ 114 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో 106 ఇన్నింగ్స్ల్లో 3 వేల 958 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్తీ ఒక సెంచరీ, 36 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 138గా ఉంది.

ఈ టోర్నీలో కోహ్లీ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. సెమీ-ఫైనల్కు ముందు, అతను గ్రూప్ 2లో ఆడిన 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మూడు సందర్భాల్లోనూ అజేయంగా నిలిచాడు.

కోహ్లీ పాకిస్థాన్పై 82, నెదర్లాండ్స్పై 62, బంగ్లాదేశ్పై 64 నాటౌట్గా నిలిచాడు.




