- Telugu News Photo Gallery Cricket photos IND vs SL: Mohammed Siraj Lights Up Asia Cup Final With Fastest 5 Wicket Haul In ODIs
IND vs SL: ప్రేమదాసలో చరిత్ర సృష్టించిన సిరాజ్.. దెబ్బకు ఆ దిగ్గజాల రికార్డులు గల్లంతు..
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. సిరాజ్ బుల్లెట్లాంటి బంతులకు లంకేయుల దగ్గర సమాధానం లేకుండా పోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 పరుగులిచ్చి 6 వికెట్ల పడగొట్టాడు. వన్డే కెరీర్ బెస్ట్ సాధించిన సిరాజ్ గతంలో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును సమం చేశాడు.
Updated on: Sep 17, 2023 | 6:11 PM

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. సిరాజ్ బుల్లెట్లాంటి బంతులకు లంకేయుల దగ్గర సమాధానం లేకుండా పోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 పరుగులిచ్చి 6 వికెట్ల పడగొట్టాడు. వన్డే కెరీర్ బెస్ట్ సాధించిన సిరాజ్ గతంలో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును సమం చేశాడు.

29 ఏళ్ల సిరాజ్ కేవలం 16 బంతుల వ్యవధిలోనే 5 వికెట్ల పడగొట్టడం విశేషం. ఈ విషయంలో శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ రికార్డును సమం చేశాడీ టీమిండియా స్పీడస్టర్. 2003లో బంగ్లాదేశ్పై వాస్ కూడా 16 బంతుల వ్యవధిలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా- డచ క్రికెటర్ టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ రెండోస్థానంలో ఉన్నాడు. 2013లో కెనాడాతో జరిగిన 5 వికెట్లు తీసుకోవడానికి గుగ్టెన్ 20 బంతులు తీసుకున్నాడు.

ఇక ఇదే మ్యాచ్లో వన్డేల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు హైదరాబాదీ పేసర్. 29 మ్యాచ్లోనే సిరాజ్ ఈ ఘనతను అందుకోవడం విశేషం. అయితే బంతుల పరంగా వన్డేల్లో వేగంగా 50 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడీ స్పీడ్స్టర్. ఈ జాబితాలో అజంతా మెండిస్ (847 బంతుల్లో) మొదటి స్థానంలో ఉన్నాడు. సిరాజ్ 50 వికెట్లను తీసేందుకు 1002 బంతులు తీసుకున్నాడు.

ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్కు ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ముందు లంకేయులు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా కేవలం 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీశాడు.

కాగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాపై అత్యల్ప స్కోరును నమోదు చేసింది శ్రీలంక. ఓవరాల్గా వన్డేల్లో ఆ జట్టు రెండో అత్యల్ప స్కోరు. ఇక ఆసియా ఛాంపియన్గా నిలిచేందుకు మరో అడుగుదూరంలో నిలిచింది భారత్. ఈ మ్యాచ్లో గెలిస్తే ఎనిమిదోసారి ఆసియాకప్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ లంక గెలిస్తే భారత్తో సమానంగా నిలుస్తోంది.




