By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
Updated on: Mar 10, 2022 | 8:25 AM
ముంబైలో జన్మించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే.. 'మురారి' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖడ్గం, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ చిత్రాల్లోనూ నటించింది సోనాలి బింద్రే.
2018లో ప్రణాంతకమైన మెటాస్టాటిక్ క్యాన్సర్కు గురైంది. బతకడానికి తక్కువ అవకాశం ఉందని వైద్యులు చెప్పినా.. సోనాలి కృంగిపోలేదు.
న్యూయార్క్లో చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారిని ఓడించి ఇండియాకు తిరిగి వచింది.
ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న సోనాలి.. రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
బుల్లితెరపై సందడి చేయబోతోంది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 షోకి ఈమె జడ్జ్గా వ్యవహరిస్తోంది.