Rishab Shetty: టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న కన్నడ స్టార్
కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్లో వరుస సినిమాలు చేస్తూనే ప్యారలల్గా టాలీవుడ్లోనూ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ మూవీస్తో తెలుగు ఇండస్ట్రీలో భాగం కావాలనుకుంటున్నారు.
Updated on: Nov 28, 2024 | 9:00 PM

కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్లో వరుస సినిమాలు చేస్తూనే ప్యారలల్గా టాలీవుడ్లోనూ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ మూవీస్తో తెలుగు ఇండస్ట్రీలో భాగం కావాలనుకుంటున్నారు.

రిజీనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్గా మారిపోయారు రిషబ్ శెట్టి.

కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్, ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో వెంటనే పార్ట్ 2ను ఎనౌన్స్ చేశారు. పార్ట్ 2ను కూడా తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇంత బిజీలోనూ కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నారు రిషబ్.

మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న జై హానుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో తెలుగు సినిమాకు రిషబ్ ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు చెప్పిన కథ నచ్చటంతో సోలోగా హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు రిషబ్. ఆల్మోస్ట్ ఓకే అయిన ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అతి త్వరలో ఎనౌన్స్మెంట్ రానుంది.




