- Telugu News Photo Gallery Cinema photos Lokesh kanagaraj giving interesting updates along with Kaithi 2
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్ప్రైజ్ ఇచ్చిన లోకేష్
ఖైదీ సినిమ విడుదలై దగ్గర దగ్గర ఐదేళ్లు అవుతున్న ఈ సినిమా సీక్వెల్ పై ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు కార్తీ అభిమానులు.. అయితే ఈ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. త్వరలో ఖైదీ 2 షూటింగ్ మొదలు కానుంది అని అఫీషియల్గా కన్ఫార్మ్ చేశారు. అయితే దీనితో పాటు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు లోకేష్. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
Updated on: Oct 28, 2024 | 9:42 PM

ఖైదీ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. త్వరలో ఖైదీ 2ను పట్టాలెక్కిస్తానని అఫీషియల్గా కన్ఫార్మ్ చేశారు. అయితే ఖైదీ 2 కన్నా ముందు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు లోకేష్. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన యంగ్ టెక్నీషియన్ లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమా నుంచి మొదలు పెట్టి తన ప్రతీ మూవీని మరో మూవీతో కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్, వెండితెర మీద ఓ గ్యాంగ్స్టర్ యూనివర్స్ను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎల్సీయూకి సంబంధించి రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు లోకేష్.

లియో రిలీజ్ తరువాత ఖైదీ, విక్రమ్, లియో సినిమాల్లోని క్యారెక్టర్స్ను కనెక్ట్ చేస్తూ వాటి టైమ్స్ లైన్స్ను డీకోడ్ చేశారు. అయితే అవి ఎంత వరకు కరెక్ట్ అన్నది క్లారిటీ లేదు. అందుకే ఖైదీ 2 రిలీజ్కు ముందు ఎల్సీయూ విషయంలో క్లియర్ పిక్చర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్ లోకేష్. 10 నిమిషాల నిడివితో ఎల్సీయూ కనెక్షన్స్ను రివీల్ చేస్తూ ఓ షార్ట్ ఫిలింను రిలీజ్ చేయబోతున్నారు.

అభిమానుల లెక్కల ప్రకారం ఖైదీ సినిమా 2019లో జరుగుతుంది. అంతకు ముందు పదేళ్ల పాటు ఢిల్లీ జైల్లో ఉన్నాడు. అంటే 2009కి ముందు ఢిల్లీ జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఖైదీ 2 ఉండే ఛాన్స్ ఉంది. విక్రమ్ కథ కూడా ఖైదీ కథకు ప్యారలల్గా జరుగుతున్నట్టుగానే చూపించారు. అంటే విక్రమ్ స్టోరి టైమ్ పీరియడ్ కూడా 2019 లోనే ఉంటుంది.

విక్రమ్ సినిమా క్లైమాక్స్లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి, రోలెక్స్ కథ కూడా ఢిల్లీ, విక్రమ్ క్యారెక్టర్లకు ప్యారలల్గానే ట్రావెల్ చేస్తుందన్న కంక్లూజన్కు వచ్చేశారు. లియో స్టోరి మాత్రం 2021లో జరగుతుంది. సో కాస్త అటు ఇటుగా అన్ని క్యారెక్టర్స్ ఒకే టైమ్ పీరియడ్లో ఉంటాయన్నది ఫ్యాన్స్ వర్షన్. మరి అభిమానుల క్యాలిక్యులేషన్ కరెక్టేనా...? లోకేష్ తీయబోయే షార్ట్ ఫిలింలో ఏం క్లారిటీ ఇస్తారు లెట్స్ వెయిట్ అండ్ సీ.




