సోఫాలో జాలీగా.. బాబోయ్ ఈ అమ్మడు అందమే అందం!
కొంత మంది సినిమాలు తక్కువ చేసినా, తన గ్లామర్తో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అందులో ముందుంటుంది తెలుగు బ్యూటీ ఐశ్వర్యా మీనన్. తాజాగా ఈ అమ్మడు సోఫాలో జాలీగా కూర్చొని, తన అందంతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. ట్రెండీ డ్రెస్లో అదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 26, 2025 | 2:57 PM

తమిళంలో వరసగా సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ ఐశ్వర్యా మీనన్. ఈ అమ్మడు నిఖిల్ స్పై మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా హిట్ అందుకోకపోవడంతో ఈ నటికి కూడా అంతగా క్రేజ్ రాలేదనే చెప్పాలి.

అంతే కాకుండా స్పై మూవీ తర్వాత ఐశ్వర్యా మీనన్కు అవకాశాలు కూడా అంతగా రాలేదు. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కార్తికేయ సరసన భజే వాయు వేగం సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

దీంతో ఈ నటికి టాలీవుడ్లో ఎక్కవగా అవకాశాలు రావడం లేదని సమాచారం. సినిమాలు లేకపోయినా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటీమణుల్లో ఈమె ఒకరు.

తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. సోఫోలో కూర్చొని ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. అందాలు ఆరబోస్తూ, ఉన్న ఈ ఫొటోస్ నెటిజన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

సిల్వర్ కలర్ టాప్, బ్లాక్ బాటమ్ లో సింపుల్గా కనిపిస్తూ.. తన గ్లామర్తో అరాచకం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





























