Jayam Ravi: దర్శకుడిగా మారుతున్న జయం రవి.. మరో చాలెంజ్కు రెడీ అంటున్న కోలీవుడ్ స్టార్
పొన్నియిన్ సెల్వన్ సక్సెస్తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జయం రవి మరో చాలెంజ్కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా వెల్లడించారు. తన డైరెక్టోరియల్ లిస్ట్లో క్రేజీ ప్రాజెక్ట్స్ను రెడీ చేస్తున్నారు. ఆ మధ్య తనీ ఒరువన్ సీక్వెల్ను ఎనౌన్స్ చేసిన జయం రవి, ప్రస్తుతం బ్రదర్, జీనీ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి.
Updated on: Feb 21, 2024 | 8:27 PM

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జయం రవి మరో చాలెంజ్కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా వెల్లడించారు. తన డైరెక్టోరియల్ లిస్ట్లో క్రేజీ ప్రాజెక్ట్స్ను రెడీ చేస్తున్నారు.

ఆ మధ్య తనీ ఒరువన్ సీక్వెల్ను ఎనౌన్స్ చేసిన జయం రవి, ప్రస్తుతం బ్రదర్, జీనీ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇంత బిజీలోనూ దర్శకుడిగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు ఈ కోలీవుడ్ స్టార్ హీరో.

రీసెంట్గా సైరెన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన జయం రవి, ఆ సినిమా ప్రమోషన్లో తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా చెప్పిన జయం రవి ఆల్రెడీ కథలు కూడా సిద్ధం చేసుకున్నారట.

తొలి ప్రయత్నంగా కమెడియన్ యోగి బాబు లీడ్ రోల్లో ఓ సినిమాను రూపొందించబోతున్నట్టుగా వెల్లడించారు జయం రవి. ఇప్పటికే హీరోగానూ మంచి విజయాలు సాధించిన యోగిబాబుతో సెటైరికల్ కామెడీని ప్లాన్ చేస్తున్నారు జయం రవి.

తనే హీరోగా ఓ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ కోలీవుడ్ స్టార్. తన టేస్ట్కు తగ్గట్టుగా ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్లో స్వయంగా నటించి దర్శకత్వం వహించబోతున్నారు. మరో కోలీవుడ్ స్టార్ హీరోతోనూ ఓ భారీ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట ఈ స్టార్ హీరో.




