Two Wheelers: కరోనా ఎఫెక్ట్.. ద్విచక్ర వాహనదారులకు శుభవార్త.. హోండా వాహనాలకు జూలై 31వ తేదీ వరకు వారంటీ పొడిగింపు

Two Wheelers: హోండా స్కూటర్‌, బైక్‌ వాహనాలకు ఉచిత సర్వీసింగ్‌ వెసులుబాటు కల్పిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతున్న ..

|

Updated on: May 18, 2021 | 3:35 PM

Two Wheelers: హోండా స్కూటర్‌, బైక్‌ వాహనాలకు ఉచిత సర్వీసింగ్‌ వెసులుబాటు కల్పిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు కంపెనీ నిర్ణయం వర్తిస్తుంది.

Two Wheelers: హోండా స్కూటర్‌, బైక్‌ వాహనాలకు ఉచిత సర్వీసింగ్‌ వెసులుబాటు కల్పిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు కంపెనీ నిర్ణయం వర్తిస్తుంది.

1 / 3
ఈ ఏడాది జూలై 31 వరకు వారంటీ, వెహికల్‌ సర్వీస్‌ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. హోండా టూవీలర్ కస్టమర్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్యలో వారంటీ, ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ అయిపోయే హోండా టూవీలర్లకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. హోండా మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా కంపెనీలు వారంటీ పొడిగింపు నిర్ణయాన్ని వెల్లడించాయి.

ఈ ఏడాది జూలై 31 వరకు వారంటీ, వెహికల్‌ సర్వీస్‌ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. హోండా టూవీలర్ కస్టమర్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్యలో వారంటీ, ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ అయిపోయే హోండా టూవీలర్లకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. హోండా మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా కంపెనీలు వారంటీ పొడిగింపు నిర్ణయాన్ని వెల్లడించాయి.

2 / 3
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుందయ్, టయోటా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వారంటీ పొడిగించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాల విభాగంలో యమహా కంపెనీ వారంటీని పొడిగించింది. జూన్‌ 30 వరకు పొడిగింపు నిర్ణయం అమల్లో ఉంటుంది. ఇలా కరోనా కారణంగా దాదాపు  అన్ని వాహన కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుందయ్, టయోటా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వారంటీ పొడిగించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాల విభాగంలో యమహా కంపెనీ వారంటీని పొడిగించింది. జూన్‌ 30 వరకు పొడిగింపు నిర్ణయం అమల్లో ఉంటుంది. ఇలా కరోనా కారణంగా దాదాపు అన్ని వాహన కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి.

3 / 3
Follow us