- Telugu News Photo Gallery Business photos Indian Railways: This bihar district has railway stations of two countries facts and name will shock you
Indian Railways: భారతదేశంలోని ఈ జిల్లాలో రెండు దేశాల రైల్వే స్టేషన్లు.. ఎక్కడో తెలుసా?
Indian Railways: జైనగర్ రైల్వే స్టేషన్ భారతదేశం నుండి చివరి స్టేషన్గా పరిగణిస్తారు. దీని తరువాత సరిహద్దు దాటిన తర్వాత నేపాల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశం ప్రయాణికులు, రైల్వే నెట్వర్క్ పరంగా చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. అలాగే..
Updated on: Aug 18, 2025 | 1:59 PM

Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్. అ ఆలాగే ఆసియాలో రెండవ స్థానంలో ఉంది. 67 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ట్రాక్పై ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. లక్షలాది మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 7349 రైల్వే స్టేషన్లు ప్రయాణికులను అనుసంధానిస్తున్నాయి. వీటిలో పెద్ద టెర్మినల్స్, జంక్షన్లకు చిన్న హాల్ట్లు ఉన్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ల గుండా ప్రయాణించి తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారు.

భారతదేశంలోని వివిధ జిల్లాల్లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ బీహార్లోని మధుబని జిల్లా మిగతా వాటి కంటే ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇది భారతదేశానికి అనుసంధానించి ఉండడమే కాకుండా కాకుండా పొరుగు దేశమైన నేపాల్కు కూడా నేరుగా అనుసంధానించబడి ఉంది.

భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ మధుబని జిల్లాలోని జయనగర్లో ఉంది. నేపాల్ సరిహద్దు ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. నేపాల్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించారు. రెండింటినీ అనుసంధానించడానికి ఒక ప్రత్యేక ఓవర్బ్రిడ్జిని నిర్మించారు.

జైనగర్ రైల్వే స్టేషన్ భారతదేశం నుండి చివరి స్టేషన్గా పరిగణిస్తారు. దీని తరువాత సరిహద్దు దాటిన తర్వాత నేపాల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశం ప్రయాణికులు, రైల్వే నెట్వర్క్ పరంగా చాలా ప్రత్యేకమైనదిగా ఉంది.

భారతదేశం - నేపాల్ నుండి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తారు. ఈ స్టేషన్లు రెండు దేశాలను అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా ఉన్నాయి. వాణిజ్యం, పర్యాటక పరంగా కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

నేపాల్ వెళ్లే ప్రయాణికులు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి కఠినమైన తనిఖీలు చేయించుకోవాలి. ప్రయాణికులు తమ లగేజీ, పత్రాలను తనిఖీ చేసిన తర్వాతే మరొక దేశం రైల్వే సరిహద్దులోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.




