Indian Railways: భారతదేశంలోని 5 పురాతన రైల్వే స్టేషన్లు ఏవో తెలుసా?
ఇండియన్ రైల్వే.. ప్రపంచంలో భారత రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత రైల్వే శాఖ దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. వివిధ స్టేషన్ల నుంచి లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేస్తుంటుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటుంది. అయితే దేశంలో..
Updated on: Apr 29, 2024 | 12:45 PM

ఇండియన్ రైల్వే.. ప్రపంచంలో భారత రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత రైల్వే శాఖ దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. వివిధ స్టేషన్ల నుంచి లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేస్తుంటుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటుంది. అయితే దేశంలో అతిపురాతనమైన స్టేషన్లు కూడా ఉన్నాయి. భారత్లో రైలు సేవలు 170 సంవత్సరం క్రితమే ప్రారంభమయ్యాయి. రైలు నెట్వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవది. బ్రిటిష్ పాలన నాటి భారతదేశంలోని ఐదు పురాతన రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాం.

ఛత్రపతి శివాజీ: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. దీనిని 1950లో నిర్మించారు. గతంలో బోరి బందర్, విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవారు. ఇది దేశంతో పురాతనమైన స్టేషన్గా ప్రసిద్ధి చెందింది. దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1953లో బోరి బందర్ నుంచి థానే వరకు నడిచింది. 1887లో విక్టోరియా టెర్మినల్, 1996లో ఛత్రపతి శివాజీ టెర్మినల్గా మార్చారు.

పశ్చిమ బెంగాల్: 1852లో నిర్మించిన బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రయాణికుల రద్దీ అధికాంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ హౌరా స్టేషన్లో 23 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అలాగే భారతదేశంలోని ఏ స్టేషన్లోనూ గరిష్ట సంఖ్యలో ప్లాట్ఫామ్లు ఉన్నాయి.

చెన్నైలోని రాయపురం భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది 1856లో నిర్మించారు. దక్షిణ భారతదేశంలో మొదటి రైలు సర్వీసు1 జూలై 1856న తమిళనాడులోని ఆర్కాట్లోని రోయపురం నుంచి వాలాజా రోడ్ వరకు నడిచింది.

జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ మరొక పాత స్టేషన్. దీనిని 1875లో నిర్మించారు. ఇది ఇప్పుడు రాజస్థాన్లో అత్యంత రద్దీగాఉండే స్టేషన్. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

పుదుచ్చేరి: ఇక భారతదేశంలో పురాతనమైన రైల్వే స్టేషన్లలో పుదుచ్చేరి రైల్వే స్టేషన్ ఒకటి. దీనిని 1879లో నిర్మించారు. దేశంలో పురాతనమైన రైల్వే స్టేషన్లలో ఇదొకటి.




