IND vs PAK: రికార్డులు బద్దలుకొట్టిన భారత్, పాక్ మ్యాచ్.. ఎంతమంది చూశారో తెలుసా?
హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రికార్డులు బ్రేక్ చేసింది. దీంతో దాయాదుల పోరు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ఇప్పటికే తెలిసిందే. తాజాగా కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్లు పోటీ పడినప్పుడల్లా.. ఏదో ఒక రికార్డ్ బద్దలవ్వాల్సిందే. ఈసారి కూడా వీక్షకుల సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ను జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో 454 మిలియన్ల మంది వీక్షించారు. అయితే, రెండు జట్ల మధ్య గట్టి పోటీ జరగలేదు. ఎందుకంటే భారత జట్టు పాకిస్థాన్ను 61 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో స్కోరు 8-1కి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుతమైన అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే.
టీవీ, మొబైల్ వ్యూస్ లో రికార్డులు..
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమైన వెంటనే, అభిమానులు టెలివిజన్లు, మొబైల్ ఫోన్లకు అతుక్కపోయారు. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైనప్పుడు, అమెరికాతో జరిగిన మ్యాచ్ 260 మిలియన్ల వీక్షణలను పొందడం గమనించదగ్గ విషయం. ఇంకా, భారత్ – నమీబియా మ్యాచ్ కూడా 240 మిలియన్ల ప్రేక్షకులను ఆకర్షించింది.
భారత్ భారీ విజయం..
మ్యాచ్లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ భారత్కు గట్టి పోటీ ఇవ్వలేదని గమనించాలి. మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్లు పూర్తిగా అలసిపోయినట్లు కనిపించారు. మొదట, పేలవమైన బౌలింగ్, తరువాత బ్యాటింగ్ వెనుకబడి ఉండటం వారి పతనానికి దారితీసింది. చివరికి 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటివరకు, టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య తొమ్మిది మ్యాచ్లు జరిగాయి. పాకిస్తాన్ ఒక్కసారి గెలిచింది. భారత జట్టు ఎనిమిది గెలిచింది.
గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్థాన్ను ఓడించింది. పాకిస్తాన్ ఓటమి పట్ల పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ అసంతృప్తిగా ఉన్నారని, ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని జట్టు యాజమాన్యాన్ని కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదిలను జట్టు నుంచి విడుదల చేయవచ్చని కూడా చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
