14 February, 2026
Subhash
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహన తయారీ సంస్థ మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్.. తాజాగా దేశీయ మార్కెట్కు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోను పరిచయం చేసింది.
‘ఉడో’ పేరుతో విడుదల చేసిన ఈ ఆటోను ప్రారంభ ధర 3,58, 999 రూపాయలుగా నిర్ణయించింది కంపెనీ.
స్వల్పకాలం మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ఈ ధరను 3,84,299 రూపాయలకు పెంచుతామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్కు సమీపంలోని జహీరాబాద్లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్ ఆటోను తయారు చేసినట్టు మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు.
ఈ ఆటోను ఉత్పత్తి చేయడానికి రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు, ఏడాదికి రెండు లక్షల యూనిట్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక లైన్ను నెలకొల్పినట్టు చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఈ వారాంతం డెలివరీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.
సింగిల్ చార్జింగ్తో 200 కిలోమీటర్లు మైలేజీ, 11.7 కిలోవాట్ల బ్యాటరీ, గంటకు 55 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించనుంది.
ఈ ఆటోపై ఆరేండ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ అందిస్తున్నట్లు, లక్ష కిలోమీటర్ల వరకు ఉచిత సర్వీసింగ్, రూ.20లక్షల ప్రమాద బీమా ఉందన్నారు.