AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత.. పాలు తాగుతున్న శివాలయంలోని నంది

శివుడి ముందు ఉండే నంది పాలు తాగుతుందా? అవునంటూ.. ఆలయానికి పోటెత్తారు భక్త జనం. పాలు తాగుతుందని పోటీ పడి మరీ నందికి పాలు పోసారు.

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత.. పాలు తాగుతున్న శివాలయంలోని నంది
Nandi Drinking Milk
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2022 | 12:46 PM

Share

Nandi Drinking Milk:  శివుడి ముందు ఉండే నంది పాలు తాగుతుందా? అవునంటూ.. ఆలయానికి పోటెత్తారు భక్త జనం. పాలు తాగుతుందని పోటీ పడి మరీ నందికి పాలు పోసారు. ఆదిలాబాద్‌ జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో జరిగిందీ ఘటన. ఆనోటా ఈనోటా పాకి మ్యాటర్‌ జనం చెవిలో పడడంతో ఈ వింత చూసేందుకు క్యూకట్టారు. గాండ్ల సంఘం శివాలయంలో నందికి పాలు పోసారు భక్తులు. అయితే ఎప్పుడూ లేనిది నంది పాలు తాగడం గమనించారు. ముందు షాకయ్యారు. ఆ తర్వాత గిన్నెలు, చెంచాలతో నందికి పాలు తాగించారు. గిన్నెలో పాలు నంది గుటగుటా తాగినట్టే కనిపిస్తోంది. నిజంగానే నంది పాలు తాగుతుందా? లేదంటే విగ్రహం పాలను పీల్చేస్తుందా? అన్న విషయం తెలియరాలేదు. భక్తులు మాత్రం దేవుడి మహిమ అంటూ ఉప్పొంగిపోతున్నారు. మహా శివరాత్రి మహోత్సవం ముగిసిన తర్వాత ఇలాంటిది జరగడంతో ఇదంతా శివయ్య లీలంటూ అక్కడికి వచ్చిన భక్తులు అనుకుంటున్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడు పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి ఘటనలు గతంలో తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే.

Also Read: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే