AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Town: భారతదేశపు చివరి రహదారి రహస్యాలతో నిండి ఉంది.. అందుకే ఇది దెయ్యం పట్టణం

ఈ పట్టణం ఓ సుదూర ప్రదేశం.. దీనికి ఓ విషాదకరమైన గతం ఒక వింతైన కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే దీనిని 'దెయ్యం పట్టణం' అని కూడా అంటారు.

Ghost Town: భారతదేశపు చివరి రహదారి రహస్యాలతో నిండి ఉంది.. అందుకే ఇది దెయ్యం పట్టణం
Dhanushkodi
Sanjay Kasula
|

Updated on: Aug 10, 2021 | 10:54 AM

Share

భారత్ ఓ వైవిధ్యభరితమైన దేశం. వింతలు విశేషాలకు కొదవేలేదు. ఈ దేశం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. అలాంటి ప్రదేశం ఇకటి తమిళనాడుకు తూర్పు తీరంలోని రామేశ్వరం ద్వీపం ఒడ్డున ఉంది. ఈ పట్టణం ఓ సుదూర ప్రదేశం.. దీనికి ఓ విషాదకరమైన గతం ఒక వింతైన కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే దీనిని ‘దెయ్యం పట్టణం’ అని కూడా అంటారు. ఈ ప్రదేశం నుండి శ్రీలంక స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భారతదేశపు చివరి ముగింపు అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఓ రహదారి కూడా ఉంది. దీనిని భారతదేశపు చివరి రహదారి అని కూడా పిలుస్తారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ధనుష్కోడి గ్రామం గురించి. ఈ గ్రామం చాలా మర్మమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడి నుండి రామేశ్వరం దూరం దాదాపు 15 కిలోమీటర్లు. మొత్తం ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. పగటిపూట ప్రజలు తిరిగేందుకు ఇక్కడికి వచ్చినప్పటికీ.. రాత్రి సమయంలో ఇక్కడి వచ్చినవారిని  వెనక్కి పంపిస్తారు స్థానిక పోలీస్ అధికారులు. రాత్రిపూట ఇక్కడ ఉండడం లేదా తిరగడం ఖచ్చితంగా నిషేధించబడింది.

ఈ ప్రదేశం 1964 తర్వాత నిర్మానుష్యంగా..

ఇది గతంలో ప్రదేశం ఇలా నిర్మానుష్యంగా లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజలు ఇంతకు ముందు ఇక్కడ నివసించేవారు. ఆ సమయంలో ధనుష్కోడి రైల్వే స్టేషన్ నుండి హాస్పిటల్, చర్చి, హోటల్, పోస్టాఫీసు వరకు ప్రతిదీ  ఇక్కడ ఉంది. కానీ 1964 లో వచ్చిన భయంకరమైన తుఫాను అంతా ముంచేసింది. ఈ తుఫాను కారణంగా 100 మందికి పైగా ప్రయాణికులతో ఉన్న రైలు సముద్రంలో మునిగిపోయిందని చెబుతున్నారు. అప్పటి నుండి ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

పాల్క్ జలసంధిలో భారతదేశం – శ్రీలంక మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు ధనుష్కోడి. దీని పొడవు కేవలం 50 గజాలు మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రదేశం ప్రపంచంలోని అతిచిన్న ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.   సముద్రంపై రామసేతు నిర్మాణం ప్రారంభమైన ప్రదేశం కూడా ధనుష్కోడి. ఈ గ్రామంలో రాముడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. విభీషణుని ఆదేశం మేరకు శ్రీరాముడు తన విల్లు ఒక చివరతో వంతెనను పగలగొట్టాడని నమ్ముతారు. ఈ కారణంగా దీనికి ధనుష్కోడి అనే పేరు వచ్చింది.

గతంలో ఇలా..

ఒకవైపు హిందూ మహాసముద్రం..  మరొక వైపు బంగాళాఖాతం మధ్యలో ధనుష్కోడి. ఒకప్పుడు సందడిగా  అభివృద్ధి చెందుతున్న పట్టణంగా ఉండేది. ఇళ్ళు, పాఠశాలలు, దేవాలయం, పోస్టాఫీసు, రైల్వే స్టేషన్‌తోపాటు అభివృద్దికి సంకేతంగా నిలిచే అన్ని ఇక్కడ ఉండేవి. దేశంలోని అత్యంత ధనిక ఫిషింగ్ బెల్ట్‌లలో ఒకటిగా పిలువబడే ఈ చిన్న పట్టణంలో వేలాది మంది నివసిస్తున్నారు. అలాగే, ఇది శ్రీలంక.. భారతదేశాల మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు, అనేక మంది యాత్రికులు, వ్యాపారులకు ప్రధాన ఓడరేవుగా పనిచేసింది. పట్టణంలోని దేవాలయంను చాలా మంది భక్తులు సందర్శించారు, ఇది టూరిస్టులకు ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఉండేది.

ఇవి కూడా చదవండి:  Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి