AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రపతి నుంచి ‘నారీ శక్తి పురస్కారాలు’ .. అవార్డు అందుకున్న ఏపీ మహిళ

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆదివారం 12 మంది మహిళలు ' నారీ శక్తి అవార్డులు'  అందుకున్నారు. వీరిలో ఏపీ.శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ కూడా ఉన్నారు.

రాష్ట్రపతి నుంచి 'నారీ శక్తి పురస్కారాలు' .. అవార్డు అందుకున్న ఏపీ మహిళ
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 08, 2020 | 3:43 PM

Share

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆదివారం 12 మంది మహిళలు ‘ నారీ శక్తి అవార్డులు’  అందుకున్నారు. వీరిలో ఏపీ శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ కూడా ఉన్నారు. ఆమెతో బాటు ముంగేర్ (బీహార్) కి చెందిన బీనాదేవి, శ్రీనగర్ కు చెందిన ఆరిఫా జాన్, ఝార్ఖండ్ కు చెందిన ఛామీ ముర్ము, లేహ్ (లడఖ్) కు చెందిన నీల్జా వాగ్మో , మహారాష్ట్రవాసి రష్మీ, పంజాబ్ వాసి 103 ఏళ్ళ మాన్ కౌర్, తదితరులు ఉన్నారు. కాగా-గ్రామీణ మహిళా రైతుల అభ్యున్నతి , గిరిజన మహిళా అభివృద్ధి కోసం పడాల భూదేవి ఎంతగానో కృషి చేశారు. తన 11 ఏళ్ళ వయస్సులోనే వివాహమై భర్త, అత్తమామల నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, తన ముగ్గురు కూతుళ్లతో అన్ని కష్టాలను ఎదుర్కొని పేద మహిళల కు రోల్ మోడల్ గా నిలిచింది ఆమె స్వయంకృషితో వారు ఎదిగేందుకు తనవంతు చేయూతను అందించింది. ఇక పంజాబ్‌కు చెందిన మాన్ కౌర్ 93 ఏళ్ళ వయస్సులో అథ్లెటిక్ చాంపియన్ కావడం విశేషం. నాలుగు ట్రాక్ అండ్ ఫీల్డ్ అవార్డులు కూడా అందుకుంది ఆమె.. పోలండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న మాన్ కౌర్‌ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.