AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: జాతరలో 73 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జానపద నృత్యాన్ని చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో వైరల్

Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Former CM Siddaramaiah) జాతర సందర్భంగా కర్ణాటకకు చెందిన సాంప్రదాయ జానపద నృత్య (Traditional folk dance) రూపమైన..

Karnataka: జాతరలో 73 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జానపద నృత్యాన్ని చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో వైరల్
Siddaramaiah Performs Folk
Surya Kala
|

Updated on: Mar 27, 2022 | 12:03 PM

Share

Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Former CM Siddaramaiah) జాతర సందర్భంగా కర్ణాటకకు చెందిన సాంప్రదాయ జానపద నృత్య (Traditional folk dance) రూపమైన వీర కుణితాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు, రాజకీయ నాయకుడు నృత్యం చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో..  కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య..  సిద్ధరామేశ్వర స్వామి జాతర సందర్భంగా తన స్వగ్రామమైన సిద్ధరామనహుండిలో కొంతమంది పురుషులతో కలిసి నృత్యం చేయడాన్ని చూడవచ్చు. ఈ  ఉత్సవంలో సిద్ధరామయ్య , ఇతరులు ఆడి పాడారు. ఈ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు చుట్టూ గుమిగూడారు. సాంప్రదాయ డ్రమ్స్  వాయిస్తూ.. డప్పుల వాయిద్యానికి అనుగుణంగా  నృత్యం చేస్తూ ఉత్సాహంగా ఉన్నారు.

మైసూరులోని వరుణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ సీఎం సిద్దరామయ్య సుమారు 40 నిమిషాల పాటు నృత్యం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ జాతరలో పాల్గొనేందుకు సంతోషిస్తున్నానని.. ఈ జాతరను తాను ఎప్పుడూ మిస్ అవ్వనని.. ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా  జాతరకు వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ జాతరకు వచ్చినట్లు సిద్ధరామయ్య చెప్పారు.

తనకు మధుమేహం రాకపోతే మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఉండేవాడినని కాంగ్రెస్ నేత అన్నారు. “నేను పాటలను మరచిపోయి ఉండవచ్చు..  కానీ నేను చాలా ఏళ్ల క్రితం నుంచి ఈ బీట్‌లకు డ్యాన్స్ చేయడం ప్రారంభించాను” అని 73 ఏళ్ల సిద్ధరామయ్య చెప్పారు. ఈ మాజీ సీఎం చిన్నతనంలోనే డ్యాన్స్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే కరోనా మహమ్మారి, ఆలయ  పునరుద్ధరణ పనుల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా జాతర నిర్వహించలేదు. ఈ సంవత్సరం జాతరను నిర్వహించడంతో.. భారీగా ప్రజలు ఆలయానికి తరలివచ్చారు. నూతన ఉత్సాహంతో జాతరలో పాల్గొన్నారని స్థానిక మీడియా పేర్కొంది.

Also Read: విమానం ఎక్కాలంటే మగ తోడు తప్పనిసరి.. మహిళల ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు

Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల

Happy Birthday Ram Charan: చెర్రీకి డిఫరెంట్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్..

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..