Vande Bharat Sleeper: త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎలా ఉందో చూశారంటే ఆగలేరు!
పూర్తి అందుబాటులోకి రాకమునుపే.. నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ట్రైన్ లోపలి ఇంటీరియర్, బెడ్లు, సౌకర్యాలన్నీ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లో ప్రయాణించడం అంటే..హై-ఎండ్ హోటల్లో ఒకరాత్రి గడిపిన ఫీలింగ్ తప్పక కలుగుతుందని చెబుతున్నారు.

రైలు ప్రయాణికులకు నిజంగానే ఇది గుడ్న్యూస్గా చెప్పాలి. ఎందుకంటే.. వచ్చే నెల నుండి వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరిగెత్తనున్నాయి. ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలతోపాటు హాయిగా నిద్రపోయేందుకు అనుకూలంగా బెర్తులు అందుబాటులో ఉండున్నాయి. ప్రస్తుతం ఉన్న సీటింగ్ వందే భారత్ రైళ్లకు కొనసాగింపుగా ఇవి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనున్నట్టు రైల్వే వెల్లడించింది. వందేభారత్ స్లీపర్ కోచ్ రైలుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
పూర్తి అందుబాటులోకి రాకమునుపే.. నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ట్రైన్ లోపలి ఇంటీరియర్, బెడ్లు, సౌకర్యాలన్నీ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లో ప్రయాణించడం అంటే..హై-ఎండ్ హోటల్లో ఒకరాత్రి గడిపిన ఫీలింగ్ తప్పక కలుగుతుందని చెబుతున్నారు.
🚨 Vande Bharat sleeper trains to be operational from next month.
30 trains planned for FY26. pic.twitter.com/5LFTa6bCUj
— Indian Tech & Infra (@IndianTechGuide) June 17, 2025
స్లీపర్ కోచ్ వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను విస్తరించాలని భారత రైల్వే నిర్ణయించింది. ప్రారంభంలో 9 వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేస్తారు. తదుపరి దశలో ఈ సంఖ్యను 50కి పెంచాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)కి తయారీ బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం. ఈ వందేభారత్ రైళ్లు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద రూపుదిద్దుకుంటున్నాయి. చెన్నైలోని ICF ఫ్యాక్టరీలో కోచ్ల తయారీ శరవేగంగా జరుగుతోంది. గంటకు 160 కి.మీ వేగంతో ఈ ట్రెయిన్ ప్రయాణిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








