AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఆ వందేభారత్‌ రైళ్ల వేగం 200 కి.మీ.!! రెండు రూట్లలో కీలక మార్పులు..

బెర్తులు ఉండే వందేభారత్‌ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా పట్టాలపై అవి 200 కి.మీ. వేగంతో..

Vande Bharat Express: ఆ వందేభారత్‌ రైళ్ల వేగం 200 కి.మీ.!! రెండు రూట్లలో కీలక మార్పులు..
Vander Bharat Express (File Photo) Image Credit source: TV9 Telugu
Ravi Kiran
|

Updated on: Jan 20, 2023 | 1:58 PM

Share

బెర్తులు ఉండే వందేభారత్‌ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా పట్టాలపై అవి 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. సీట్లు మాత్రమే అంటే ఛైర్‌కార్‌ ఉండే వందేభారత్‌లు- శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని వివరించాయి. బెర్తులు ఉండే రైళ్లు- రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు బదులుగా అందుబాటులోకి వస్తాయని తెలిపాయి. ఇది దశలవారీగా జరుగుతుంది.

400 వందేభారత్‌ రైళ్ల కోసం రైల్వేశాఖ టెండర్లు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి పనులు ఖరారు కానున్నాయి. ఈ రైళ్ల ఉత్పత్తికి నాలుగు దేశీయ దిగ్గజ కంపెనీలు, పలు విదేశీ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయి. మొదటి 200 రైళ్లలో సీట్లు మాత్రమే ఉంటాయి. అవి 180 కి.మీ. వేగం వరకు అందుకోగలవు. ఉక్కుతో తయారయ్యే ఈ రైళ్లను భద్రతపరమైన కారణాలతో 130 కి.మీ. వేగానికే పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. రెండోదశలో వచ్చే 200 రైళ్లను ఉక్కుకు బదులు అల్యూమినియంతో తయారు చేసి, బెర్తులు అమరుస్తారు. ఇవి 200 కి.మీ. వేగంతో వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-కోల్‌కతా మార్గాల్లో తగిన మార్పులు చేయడంతో పాటు కంచె వేసే పనులు చేపడుతున్నామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నివారించే సాంకేతిక ఏర్పాట్లను 1,800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రెండు మార్గాల్లో చేపడుతున్నట్లు తెలిపారు.