Vaccination: కరోనా టీకా 18 ఏళ్లు పైబడినవారికి ఒకటో తేదీన పారంభం అవుతుందా? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా వున్నాయి?

కరోనా పై యుద్ధం.. వ్యాక్సిన్ ఆయుధం సిద్ధం అంటూ రెడీ అయిపొయింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామంటూ చెప్పింది.

Vaccination: కరోనా టీకా 18 ఏళ్లు పైబడినవారికి ఒకటో తేదీన పారంభం అవుతుందా? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా వున్నాయి?
Follow us

|

Updated on: Apr 30, 2021 | 10:24 PM

Vaccination: కరోనా పై యుద్ధం.. వ్యాక్సిన్ ఆయుధం సిద్ధం అంటూ రెడీ అయిపొయింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామంటూ చెప్పింది. దీనికోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి అందరూ కచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలంది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా 2.45 కోట్ల మంది రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. అంతా బావుంది. మరి ఒకటో తారీఖూ వచ్చింది. ఇప్పడు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందా? అనేది సందేహాస్పదంగా మారింది. దీనికి కారణం టీకాల కొరత. 45 ఏళ్లు పైబడిన వారి రెండో డోసు కోసమే చాలా చోట్ల వ్యాక్సిన్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి రేపటి నుంచి 18 ఏళ్ల పైబడ్డ వారికీ టీకాలు అందుతాయా? మరి రాష్ట్రాలు ఏమంటున్నాయి. రాష్ట్రాలు డోసులు లేవు అని చెబుతున్నాయి. కేంద్రం కోటి డోసులు అందుబాటులో ఉన్నాయి అంటోంది. మరి కొన్ని రోజుల్లో ఇంకా వస్తాయి అంటోంది. మరి నిజం ఏమిటి? రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి? ఏం చేయబోతున్నాయి?

తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను అందించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ‘‘ ఇది కేంద్రం బాధ్యత. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపాం. అయితే, వ్యాక్సిన్ల లభ్యతపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల నుంచి ఏదైనా సమాచారమొస్తే మూడో విడత వ్యాక్సినేషన్‌పై క్లారిటీ వస్తుంది అని చెప్పారు. అంటే.. ఇక్కడ వ్యాక్సినేషన్ ముందుకు సాగడం అనుమానమే.

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మే ఒకటో తేదీ నుంచి మూడో విడత వ్యాక్సిన్ ప్రారంభం కావడం జరిగే పని కాదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు చెప్పిన ఆయన పూర్తి స్థాయిలో టీకా పంపిణీ జరగడానికి కొన్ని రోజులు పట్టొచ్చని చెప్పారు.

కర్ణాటక మూడో విడత వ్యాక్సినేషన్‌పై కర్ణాటకలోనూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి అవసరమైనన్ని వయల్స్‌ రాష్ట్రంలో లేవని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. ‘కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కోటి డోసులను ఆర్డర్‌ చేశాం. అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ఇంకా వాటిని అందించలేదు. అందువల్ల 18-44 మధ్య వాళ్లు వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దు. టీకాలు అందుబాటులోకి వచ్చాక సమాచారం ఇస్తాం అంటూ ఆయన ప్రకటించారు.

ఢిల్లీ ఢిల్లీలో పరిస్థితి ఘోరంగా ఉంది. రేపటి నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం చెప్పినప్పటికీ ఇక్కడ అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఇప్పటికే టీకాల కోసం కేంద్రాల ఎదుట ఎవరూ బారులు తీర వద్దని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.

మహారాష్ట్ర వెంటనే 25 నుంచి 30 లక్షల వ్యాక్సిన్‌ వయల్స్‌ రాష్ట్రానికి రాకపోతే మూడో విడత వ్యాక్సినేషన్‌ నిర్వహించడం సాధ్యం కాదని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే చెప్పేశారు. మరోవైపు వ్యాక్సిన్ల కొరత కారణంగా ముంబయి నగరకార్పొరేషన్‌ పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

గోవా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం కుదరదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. అదెప్పుడన్నది చెప్పలేమన్నారు.

మధ్యప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు సకాలంలో డోసులను సరఫరా చేయలేకపోయినందున ఇది సాధ్యపడలేదన్నారు.

పశ్చిమ్‌బెంగాల్‌ కనీసం మూడు కోట్ల డోసులను సరఫరా చేయాల్సిందిగా పశ్చిమ్‌బెంగాల్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రభుత్వ ఆస్పత్రులకు 2 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు కోటి డోసులు సమకూర్చాలని కోరింది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న కోటి మందికి రెండు కోట్ల డోసులు అవసరమవుతాయని తెలిపింది.

పంజాబ్‌ పంజాబ్‌లో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వ్యాక్సిన్ల కొరత కారణంగా ఆలస్యమవుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ స్పష్టం చేశారు.

గుజరాత్‌ ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ మూడో విడత వ్యాక్సినేషన్‌ మే 1న ప్రారంభం కావడం లేదు. అన్ని సజావుగా సాగితే మే 15 నుంచి 18 ఏళ్లు పూర్తయిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ కొరత తొ ఈ కార్యక్రమం ప్రారంభించలేం అని యూపీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుత నిల్వలు కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే సరిపోతాయని స్పష్టం చేశారు.

ఇలా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయి. కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవడం కష్టంగానే కనిపిస్తోంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!