Wayanad Landslide: వాయనాడ్కు కేంద్రం సాయం.. సహాయక శిబిరాలను సందర్శించిన కేంద్ర మంత్రి
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది మంది చిక్కుకుపోయారని, మరికొంతమంది మృతి చెందారని భావిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మొదటి కొండచరియలు విరిగిపడ్డాయి...
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది మంది చిక్కుకుపోయారని, మరికొంతమంది మృతి చెందారని భావిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మొదటి కొండచరియలు విరిగిపడ్డాయి. అనంతరం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున 4:10 గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం.
ఈ కొండచరియలు విరిగిపడటంతో పలువురు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, సైన్యం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని ఎన్డిఆర్ఎఫ్ బృందం, మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ ఆర్మీ బృందాలు ఇప్పటికే వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాయనాడ్లో అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది. కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ సహాయక శిబిరాలను సందర్శించారు. అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్రం తెలిపింది. జార్జ్ కురియన్ పలు ప్రాంతాలను సందర్శించారు. గాయపడిన వారిని పరామర్శించారు.
ఇది కూడా చదవండి: Amazon: అమెజాన్లో కళ్లు చెదిరే ఆఫర్స్.. 80 శాతం డిస్కౌంట్.. ఎప్పుడో తెలుసా?
వయనాడ్ పరిస్థితిని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. దక్షిణ భారతదేశంలోని మిలటరీ, వైమానిక దళం, నావికాదళాలను ఏర్పాటు చేయాలని పీఎంవో ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Income Tax: మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? ఈ పని చేయండి..లేకుంటే డబుల్ ట్యాక్స్
మరిన్ని జాతీయ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి