AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 మంది బీజేపీ నాయకుల భద్రతను తొలగించిన కేంద్ర హోం శాఖ..!

పశ్చిమ బెంగాల్‌లోని 32 మంది భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుల భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 26) ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్ష కమిటీ ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది బీజేపీ నాయకుల పేర్లు ఉన్నాయి.

32 మంది బీజేపీ నాయకుల భద్రతను తొలగించిన కేంద్ర హోం శాఖ..!
Amit Shah
Balaraju Goud
|

Updated on: Feb 27, 2025 | 6:47 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని 32 మంది భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుల భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 26) ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్ష కమిటీ ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది బీజేపీ నాయకుల పేర్లు ఉన్నాయి.

భద్రత ఉపసంహరించిన 32 మందిలో మాజీ కేంద్ర మంత్రి జాన్ బార్లా, మాజీ ఎంపీ దశరథ్ తిర్కీ, బీజేపీ నాయకుడు శంకుదేవ్ పాండా, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధార్ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ చేతిలో ఓడిపోయిన డైమండ్ హార్బర్ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ దాస్, డైమండ్ హార్బర్ మాజీ ఎమ్మెల్యే దీపక్ హల్దార్, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోల్పూర్ అభ్యర్థి పియా సాహా, జంగిపూర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ధనంజయ్ ఘోష్ వంటి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

“ప్రస్తుతం హరిద్వార్‌లో ఉన్నాను, దీని గురించి ఏమీ తెలియదు. ఇప్పటివరకు నాకు ఎటువంటి సందేశం రాలేదు. ఇది నిత్యకృత్యం. ప్రతి మూడు నెలలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంలో జాబితాను విడుదల చేస్తుంది. వారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మళ్ళీ వారు భద్రత కల్పిస్తారు. గత ఆరున్నర సంవత్సరాలలో ఇలాంటివి చాలాసార్లు చూశాను. కొన్ని రోజుల క్రితం 20 మంది పేర్లతో కూడిన జాబితా వచ్చింది. మళ్ళీ చాలా మందికి భద్రత కల్పించారు” అని అభిజిత్ దాస్ అన్నారు.

ఈ పరిణామంపై స్పందిస్తూ, బీజేపీ ఎంపీ, బెంగాల్ రాష్ట్ర ప్రతినిధి సమిక్ భట్టాచార్య “ఇది నిత్యకృత్యం. ఎవరికి భద్రత అవసరమో, ఎప్పుడు అవసరమో కేంద్రం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా భద్రత కల్పిస్తారు. ఆ సమయంలో, నాయకులకు భద్రత అవసరమని హోం మంత్రిత్వ శాఖ భావించి ఉండాలి. ఈ విషయంలో రాజకీయం చేయడానికి ఏమీ లేదు” అని సమిక్ భట్టాచార్య కొట్లిపారేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..