భూమి పూజ కోసం అయోధ్య చేరిన ఉమాభారతి
అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం....
అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం ఈ స్థలాన్ని సందర్శిస్తానని ఆమె ఈ నెల 3 న ప్రకటించారు. అయితే రామజన్మ భూమి సీనియర్ అధికారి ఒకరు తనకు నచ్చజెప్పడంతో ఆ యోచన విరమించుకుని వచ్చానని ఆమె అన్నారు. ఆమెకు రామజన్మభూమి స్థలం వద్ద యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ముకుళిత హస్తాలతో స్వాగతం పలికారు.
అయోధ్య అందరినీ ఏకం చేసిందని, ఇక్కడ వివక్షకు తావు లేదని ఈ దేశం ప్రపంచానికి గర్వంగా చాటిందని ఉమాభారతి పేర్కొన్నారు. ప్రధాని మోదీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం చరిత్రాత్మకమైన ఘటనగా ఆమె అభివర్ణించారు.