AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy: రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ గేమ్.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ములు స్పాట్ డెడ్

పబ్​జీ గేమ్ వ్యసనాన్ని చాలామంది వదిలిపెట్టలేకపోతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు.

Tragedy: రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ గేమ్.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ములు స్పాట్ డెడ్
Pub G
Ram Naramaneni
|

Updated on: Jan 09, 2022 | 11:24 AM

Share

పబ్​జీ గేమ్ వ్యసనాన్ని చాలామంది వదిలిపెట్టలేకపోతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు. విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ గేమ్ కారణంగా కొన్ని వివాహ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అనేకమంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. తాజాగా పబ్​జీ గేమ్ రెండు నిండు ప్రాణాలను బలి తీసకుంది. రాజస్థాన్​, జైపుర్​లో ఈ విషాదఘటన జరిగింది. పట్టాలపై పబ్​జీ ఆడుతూ ఇద్దరు తోబుట్టువులు రైలు కిందపడి  ప్రాణాలు కోల్పోయారు. అల్వార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.

లోకేశ్​ మీనా(22), రాహుల్​(19) రూప్​బాస్ పట్టణంలో వారి అక్క ఇంటి దగ్గరే ఉండి కాంపీటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వారి తండ్రి జిల్లాలోని తెల్హా గ్రామంలో నివసిస్తున్నారు. సోదరులు ఫ్రీ టైమ్ లో పబ్​జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్​బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ రూట్ లో ట్రైన్ వచ్చింది. రైలు​ను గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇరువురూ స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు.

Also Read: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్