COVID-19 Testing: ఆ దేశాల నుంచి వస్తే కరోనా పరీక్షుల తప్పనిసరి: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

COVID-19 Testing:  కరోనా మహమ్మారి ఇంకా పూర్తి స్థాయిలో కట్టడిలోకి రాలేకపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతోంది. ముందుగా బ్రిటన్‌ రకం, తాజాగా...

COVID-19 Testing: ఆ దేశాల నుంచి వస్తే కరోనా పరీక్షుల తప్పనిసరి: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Indian Travellers
Follow us

|

Updated on: Feb 18, 2021 | 8:05 PM

COVID-19 Testing:  కరోనా మహమ్మారి ఇంకా పూర్తి స్థాయిలో కట్టడిలోకి రాలేకపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతోంది. ముందుగా బ్రిటన్‌ రకం, తాజాగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలుగా వ్యాప్తిస్తోంది. ఇలా కొత్త రకం కరోనా వైరస్‌ ఆయా దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తప్పని సరి చేసింది. భారత్‌కు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ల నుంచి ప్రత్యక్ష విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు సౌదీ ఆరేబియా తదితర మధ్య దేశాల ద్వారా వస్తున్నారు. ఈ దేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా భారత్‌కు చేరుకుంటున్నారు.

ఇలా ఇతర మార్గాల ద్వారా ఇతర దేశాల వరకు భారత్‌కు వస్తే కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకు అయ్యే ఖర్చులు కూడా ప్రయాణికులే భరించుకోవాలని సూచించింది. దేశంలో ఇప్పటి వరకు 187 యూకే రకం కరోనా కేసులు నమోదు కాగా, గతనెలలో నాలుగు దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌ కేసులు, ఈనెలలో ఒక బ్రెజిల్‌ రకం కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌ రకంతో పోలిస్తే దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ కోవిడ్‌ రకాలు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ప్రయాణికులు భారత్‌కు వచ్చే ముందు కరోనా నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

Also Read: COVID-19 Deaths: ఆ 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవు.. మూడు రాష్ట్రాల్లోనే సగానికిపైగా మృతులు: కేంద్రం