ప్రభుత్వ అధికారిపై బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్ ‘చెప్పు’ దాడి..!

ప్రముఖ టిక్‌ టాక్‌ స్టార్, బీజేపీ నేత సోనాలి పొగట్ వివాదంలో చిక్కుకున్నారు. హిసార్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్‌ సింగ్‌పై ఆమె చెప్పుతో దాడి చేశారు.

ప్రభుత్వ అధికారిపై బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్ 'చెప్పు' దాడి..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 9:48 PM

ప్రముఖ టిక్‌ టాక్‌ స్టార్, బీజేపీ నేత సోనాలి పొగట్ వివాదంలో చిక్కుకున్నారు. హిసార్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్‌ సింగ్‌పై ఆమె చెప్పుతో దాడి చేశారు. శుక్రవారం బల్సామంద్ మండిలో సోనాలి పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నాపై అసభ్యంగా మాట్లాడతావా..? అంటూ పొగట్, సుల్తాన్‌పై చేయి చేసుకుంది. కాగా పొగట్, అధికారిపై దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సైలెంట్‌గా ఉండటం గమనర్హం.

రైతులను సుల్తాన్ సింగ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో సోనాలి పొగట్ మార్కెట్ యార్డుకు వెళ్లారు. ఈ క్రమంలో సుల్తాన్‌పై పొగట్ దాడికి దిగినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై సుల్తాన్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హిసార్ ఎస్పీ గంగా రామ్ పునియా తెలిపారు. పొగట్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

ఫిర్యాదు అనంతరం సుల్తాన్ సింగ్ మాట్లాడుతూ.. ”హిసార్‌లోని నా కార్యాలయానికి వచ్చిన సోనాలి, పప్పు ధాన్యాల సేకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందని అడిగింది. దానికి నేను మండిలో సరైన సదుపాయాలు లేకపోవడం వలన సేకరణ చేయడం లేదని చెప్పాను. ధాన్యాల సేకరణ కోసం ఓ షెడ్ అవసరం అవుతుందని చెప్పాను. 15 నిమిషాల మాటల తరువాత ఆమె నన్ను కొట్టడం ప్రారంభించింది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వలేదని కూడా ఆరోపణలు చేసింది. నేను మీ నియోజకవర్గానికి చెందిన వాడిని కాదని చెప్పినప్పటికీ ఆమె వినలేదు” అని అన్నారు. కాగా గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్‌ నుంచి పోటీ చేసిన సోనాలి పొగట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్దీప్ బిష్‌నోయ్‌ చేతిలో ఓడిపోయారు.

Read This Story Also: కరోనాతో ముప్పు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం..!