AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Attack: బీడీ ఆకుల కోసం వెళ్లిన మహిళను చంపిన పులి..! ఆపై ఆడవిలోకి ఈడ్చుకెళ్లి.. తినేసి..

బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి దాడి హత మార్చింది. ఆపై ఆమె మెడ పట్టుకుని కిలోమీటర్‌ దూరం పాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. అడవిలోకి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడం, అడవిలో భయంకర అరుపులు విన్న స్థానికులు 50 మందికిపైగా అడవిలో గాలింపు చేపట్టగా.. ఓ చోట మహిళ మృతదేహం దారుణ స్థితిలో లభించింది..

Tiger Attack: బీడీ ఆకుల కోసం వెళ్లిన మహిళను చంపిన పులి..! ఆపై ఆడవిలోకి ఈడ్చుకెళ్లి.. తినేసి..
Tiger Attack
Srilakshmi C
|

Updated on: May 12, 2025 | 1:14 PM

Share

భోపాల్‌, మే 12: అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి దాడి చేసింది. అనంతరం ఆమె మెడ పట్టుకుని కిలోమీటర్‌ దూరం పాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో శనివారం (మే 10) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సియోని జిల్లాలోని బిచౌమల్‌ గ్రామానికి చెందిన హేమలతా దహర్వాల్‌ (50) అనే మహిళ శనివారం అడవిలో టెండూ ఆకులు (బీడీ తయారుచేసేందుకు ఉపయోగించే ఆకులు) సేకరించడానికి ఒంటరిగా వెళ్లింది. ఆకులు సేకరిస్తున్న సమయంలో ఆమెపై పెద్దపులి దాడి చేసింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పలు ఆమె మెడను నోట్లో కరుచుకుని సుమారు 1.5 కిలోమీటర్ల దూరం అడవిలోపలికి లాక్కెల్లింది. అనంతరం ఆమెను తినడం మొదలు పెట్టింది

అడవిలోకి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడం, అడవిలో భయంకర అరుపులు విన్న స్థానికులు 50 మందికిపైగా అడవిలో గాలింపు చేపట్టగా.. ఓ చోట మహిళ మృతదేహం దారుణ స్థితిలో లభించింది. వారి అరుపులు విన్న పులి.. మృతదేహాన్ని అక్కడ వదిలేసి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మహిళ మెడ చుట్టూ, శరీరంలోని ఇతర భాగాల్లో పులి గోళ్లు, దంతాల గుర్తులు కనిపించాయి. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు మృతదేహంతో ఖవాసా అటవీ కార్యాలయం ముందు ఐదు గంటలపాటు ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే నిబంధనల ప్రకారం రూ.8 లక్షలు ఇస్తామని అధికారులు స్పష్టం చేప్పడంతో దర్నా విరమించారు. పులి కోసం అడవిలో గాలిస్తున్నామని సియోని జిల్లా అటవీ అధికారి గౌరవ్ మిశ్రా తెలిపారు.

పెంచ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనేష్ సింగ్ మాట్లాడుతూ.. మహిళను చంపిన పులిని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దాడికి పాల్పడిన పులికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుందని అన్నారు. పులి అకస్మాత్తుగా దాడి చేసిన మహిళను తీవ్రంగా గాయపరిచి హత మార్చింది. మేము పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అంతకంటే ముందుగా దాని దూకుడు వెనుక ఉన్న కారణాన్ని మనం గుర్తించాలి. సాధారణంగా పెద్ద లేదా గాయపడిన పులులు సులభంగా ఆహారం కోసం వెతుకుతాయి. కొన్నిసార్లు నిరాశతో మనుషులపై దాడి చేస్తాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!