AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: బిల్ గేట్స్, అదార్ పూనావాలాకు బాంబే హైకోర్టు నోటీసులు..కూతురి మరణంపై కోర్టును ఆశ్రయించిన తండ్రి..!

డా. స్నేహల్ జనవరి 28, 2021న కాలేజీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ,..

Covid Vaccine: బిల్ గేట్స్, అదార్ పూనావాలాకు బాంబే హైకోర్టు నోటీసులు..కూతురి మరణంపై కోర్టును ఆశ్రయించిన తండ్రి..!
Covid Vaccine
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2022 | 4:45 PM

Share

Covid Vaccine: గత రెండేళ్లలో కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సంక్షోభంలో పడ్డాయి. ఇప్పుడు కరోనా (కోవిడ్ -19) సంక్షోభం కాస్త తగ్గుముఖం పడుతోంది. కరోనా కాలంలో లక్షలాది మంది చనిపోయారు. కరోనా వ్యాక్సిన్ కారణంగా, చాలా మంది ప్రజలు ప్రాణాపాయం తప్పి సురక్షితంగా రక్షించబడ్డాయి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఓ యువతి చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపించారు.. ఈ విషయమై నేరుగా ముంబై హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ఇప్పుడు బిల్ గేట్స్, సిరామ్‌కు చెందిన అదార్ పూనావల్లకు నోటీసులు జారీ చేసింది . రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

డా. స్నేహల్ లునావత్ మృతి కేసులో అతని తండ్రి దిలీప్ లునావత్ బాంబే హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నేరుగా బిల్ గేట్స్, ఆధార్ పూనావాలా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వల్లే తన కూతురు చనిపోయిందని దిలీప్ లునావత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సిరామ్‌కు 1000 కోట్లు పరిహారం చెల్లించాలని ఆయన ఈ పిటిషన్ ద్వారా డిమాండ్ చేశారు.

కాగా, దిలీప్ లునావత్ కుమార్తె డా. స్నేహల్ లూనావత్ నాసిక్‌లో మెడిసిన్ చదువుతోంది. కరోనా సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించదు అని ప్రకటించారు. డా. స్నేహల్ జనవరి 28, 2021న కాలేజీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ, చివరకు మార్చి నెలలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తప్పిదాల వల్లే తన కుమార్తె మృతి చెందిందని దిలీప్‌ లునావత్‌ ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..