Telangana: తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ను స్వీకరించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇదే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతోంది. తాజాగా, ఈ అంశంలో గవర్నర్కు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులిచ్చింది. మరి ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..