
తమిళనాడులో గ్యాంగ్ వార్స్ హడలెత్తిస్తున్నాయి. కోయంబత్తూరులో రెండు రౌడీ గ్యాంగ్లు ఉన్నాయి. రెండు గ్యాంగ్ల మధ్య జరుగుతున్న గొడవలో.. ఓ యువకుడు చనిపోయాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. ఓ అమ్మాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయే తమన్నా. ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ తమన్నా కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
యువకుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్తో కలిసి తమన్నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చేసింది. తన ఇన్స్టా అంతా చెక్ చేయగా ఆ యువతి సిగరెట్ తాగుతూ, కత్తులతో బెదిరిస్తున్న రీల్స్ కూడా చేసింది. ఈ రీల్స్ గమనించిన పోలీసులు..కచ్చితంగా ఈ హత్య వెనుక ఆ యువతి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి ‘ఫ్రెండ్స్ కాల్ మీ తమన్నా’ అనే పేరుతో అకౌంట్ తెరిచింది. ఈ హత్య జరిగినప్పటి నుంచి ఆ లేడీ రౌడీ కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. హత్య కేసుతో పాటు మరిన్ని దోపిడీ కేసులతోనూ తమన్నాకు, ఆమె గ్యాంగ్కు ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుపిస్తున్నారు. అటు, ఆ గ్యాంగ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి